Pachi Pulusu : ప‌చ్చి పులుసును ఇలా త‌యారు చేస్తే.. క‌మ్మ‌గా ఉంటుంది..!

Pachi Pulusu : మ‌న పూర్వీకులు ఎక్కువ‌గా తిన్న ఆహార ప‌దార్థాలో చింత‌పండు గుజ్జుతో త‌యారు చేసే ప‌చ్చి పులుసు ఒక‌టి. ప‌చ్చి పులుసు చాలా రుచిగా ఉంటుంది. ప్ర‌స్తుత కాలంలో ప‌చ్చి పులుసును త‌యారు చేసే వారు చాలా త‌క్కువ‌య్యారు. కానీ దీన్ని త‌యారు చేసుకుని తింటే ఓ వైపు రుచితోపాటు.. మరోవైపు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. ప‌చ్చి పులుసుతో అన్నం తింటే జీర్ణ‌వ్య‌వ‌స్థ మొత్తం శుభ్ర‌మ‌వుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం ఉండ‌దు. అలాగే రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది. ఇక ప‌చ్చి పులుసు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Pachi Pulusu make in this way very tasty
Pachi Pulusu

ప‌చ్చి పులుసు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఎండు మిర‌ప‌కాయ‌లు – 15, చింత పండు – 20 గ్రా., త‌రిగిన ఉల్లి పాయ‌లు – 2, ఉప్పు – రుచికి స‌రిప‌డా, క‌రివేపాకు – 2 రెబ్బ‌లు, వెల్లుల్లి గ‌డ్డ – 1 (చిన్న‌ది), నీళ్లు – స‌రిప‌డా.

ప‌చ్చి పులుసు త‌యారీ విధానం..

ముందుగా ఎండు మిర‌ప కాయ‌ల‌ను పుల్కాల‌ను త‌యారు చేసే పెనంపై వేసి కాల్చుకోవాలి. త‌రువాత ఒక వెడ‌ల్పాటి గిన్నెలో నీళ్ల‌ను పోసి రుచికి స‌రిప‌డా ఉప్పును, చింత‌పండును, ముందుగా కాల్చి పెట్టుకున్న ఎండు మిర‌ప‌కాయ‌ల‌ను, క‌రివేపాకును వేసి చేత్తో న‌లుపుకుంటూ కచ్చా ప‌చ్చాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న పులుసును 5 నిమిషాల పాటు క‌దిలించకుండా ప‌క్క‌కు పెట్టుకోవాలి. త‌రువాత ఈ పులుసులో కొద్దిగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌ల‌ను, త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌ల‌ను వేసి మళ్లీ ఒక సారి చేత్తో బాగా న‌లుపుకోవాలి.

త‌రువాత ఎక్కువ‌గా ఉన్న ఎండు మిర‌ప‌కాయ గింజ‌ల‌ను తీసేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ప‌చ్చి పులుసు త‌యార‌వుతుంది. ఈ ప‌చ్చి పులుసును వేడి వేడి అన్నంలో కంటే చ‌ల్లారిన అన్నంతో లేదా రాగి సంగ‌టితో క‌లిపి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. జ‌లుబు, ద‌గ్గు బారిన ప‌డిన‌ప్పుడు లేదా నోటికి రుచిగా ఏదైనా తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా ప‌చ్చి పులుసును త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. అయితే ప‌చ్చి పులుసును త‌యారు చేశాక దాన్ని పోపు వేయ‌వ‌చ్చు. లేదా కాస్త వేడి చేసి తిన‌వ‌చ్చు. ఎలా తిన్నా ప‌చ్చి పులుసు రుచిగానే ఉంటుంది.

Share
D

Recent Posts