Paneer Matar Masala : హోట‌ల్స్‌లో ల‌భించే ప‌నీర్ మ‌ట‌ర్ మ‌సాలా.. ఒక్క‌సారి ఇలా చేస్తే మ‌ళ్లీ ఇదే కావాలంటారు..!

Paneer Matar Masala : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే ప‌నీర్ వెరైటీల‌లో ప‌నీర్ మ‌ట‌ర్ మ‌సాలా కూడా ఒక‌టి. ప‌నీర్, బ‌ఠాణీ క‌లిపి చేసే ఈ వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. చ‌పాతీ, రోటీ, నాన్, బ‌ట‌ర్ నాన్ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. రెప్టారెంట్ లో ల‌భించే ఈ ప‌నీర్ మ‌ట‌ర్ మ‌సాలాను అదే రుచితో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. రుచిగా, క‌మ్మ‌గా ప‌నీర్ మ‌ట‌ర్ మ‌సాలా ను రెస్టారెంట్ స్టైల్ లో ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ప‌నీర్ మ‌ట‌ర్ మ‌సాలా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన ట‌మాటాలు – 3, జీడిప‌ప్పు – గుప్పెడు, బ‌ట‌ర్ – 2 టేబుల్ స్పూన్స్, ప‌న్నీర్ క్యూబ్స్ – 200 గ్రా., నూనె – 3 టేబుల్ స్పూన్స్, బిర్యానీ ఆకు – 1, దాల్చిన చెక్క -ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 4, యాల‌కులు – 2, చిన్న‌గా త‌రిగిన పెద్ద ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, చిన్న ముక్క‌లుగా త‌రిగిన ట‌మాట – 1, ప‌సుపు – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక‌టిన్న‌ర టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, కాశ్మీరి చిల్లీ కారం – ఒక‌టిన్న‌ర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ఉడికించిన ప‌చ్చిబ‌ఠాణీ – అర క‌ప్పు, క‌సూరి మెంతి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, నెయ్యి – 2 టీ స్పూన్స్.

Paneer Matar Masala recipe in telugu very tasty how to make this
Paneer Matar Masala

ప‌నీర్ మ‌ట‌ర్ మ‌సాలా త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో ట‌మాట ముక్క‌లు, జీడిపప్పు, ఒక గ్లాస్ నీళ్లు పోసి ట‌మాట ముక్క‌ల‌ను ఉడికించాలి. వీటిని మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత వీటిని జార్ లో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో బ‌ట‌ర్ వేసి వేడి చేయాలి. బ‌ట‌ర్ వేడ‌య్యాక ప‌నీర్ ముక్క‌లు వేసి వేయించాలి. వీటిని కొద్దిగా రంగు మారే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత అల్లం పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్తబ‌డే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ఉప్పు, ప‌సుపు, కారం, కాశ్మీరి చిల్లీ కారం, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడివేసి క‌ల‌పాలి.

త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్, పావు క‌ప్పు నీళ్లు పోసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి చిన్న మంట‌పై నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత బ‌ఠాణీ, క‌సూరి మెంతి వేసి క‌ల‌పాలి. త‌రువాత ముప్పావు గ్లాస్ నీళ్లు పోసి క‌లిపి మూత పెట్టి మ‌రో 5 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత ప‌నీర్ ముక్క‌లు వేసి క‌లిపి మూత పెట్టి మ‌రో 3 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. చివ‌ర‌గా నెయ్యి, మ‌రి కొద్దిగా బ‌ట‌ర్, కొత్తిమీర వేసి క‌లిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ప‌నీర్ మ‌ట‌ర్ మ‌సాలా త‌యార‌వుతుంది. వీకెండ్స‌ల్ లో ఇంట్లోనే ఇలా ప‌నీర్ మ‌ట‌ర్ మ‌సాలాను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts