business

ర‌త‌న్ టాటా అంత్య‌క్రియలు ఎలా జ‌రిగాయి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">భారతదేశంలోనే గొప్ప పారిశ్రామికవేత్త&comma; సామాజిక కార్యకర్త&comma; టాటా గ్రూప్ గౌరవాధ్యక్షుడు రతన్ నావల్ టాటా&lpar;86&rpar; à°µ‌యోభారం కార‌ణంగా ఇటీవ‌à°² క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే&period; ఆయ‌à°¨ మృతికి దేశం మొత్తం నివాళులు అర్పించింది&period; ఇక ఆయ‌à°¨ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు&period; రతన్‌ టాటా అంత్యక్రియలు ముంబయిలోని వర్లీ శ్మశానవాటికలో జరిగాయి&period; ప్రజల సందర్శన కోసం టాటా పార్థివదేహాన్ని ఆయన నివాసం నుంచి ఎన్‌సీపీఏ గ్రౌండ్‌కు తరలించారు&period; అనంతరం వర్లీ శ్మశానవాటికలో రతన్‌ టాటా పార్థివదేహానికి అంత్యక్రియలు పూర్తిచేశారు&period; అయితే&comma; పార్సీ మతస్థుడైనప్పటికీ ఎలక్ట్రిక్‌ విధానంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హిందూ మతం ఆచారాల ప్రకారం భౌతికకాయాన్ని కాల్చడం లేదా భూమిలో పూడ్చడం చేస్తారు&period; ముస్లింలు కూడా భూమిలో పాతిపెడతారు&period; కానీ పార్సీ మతంలో భౌతికకాయాన్ని కాల్చడం లేదా పూడ్చివేయడం వంటివి చేయరు&period; ఈ సందర్భంగా పార్సీ మతంలో భౌతికకాయాన్ని ఏం చేస్తారు&period;&period; వారు అంత్యక్రియలను ఎలా నిర్వహిస్తారు అనే దానిపై చాలా మందిలో అనుమానాలు ఉన్నాయి&period; మన దేశంలో పార్సీ మతాన్ని విశ్వసించే వారు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు&period; ఈ మతంలో ఎవరైనా మరణిస్తే&comma; అంత్యక్రియల విధానం అందరికంటే చాలా విభిన్నంగా ఉంటుంది&period; పార్సీ కమ్యూనిటీలో ఎవరైనా చనిపోతే భౌతికకాయాన్ని కాల్చడం&comma; పూడ్చిపెట్టడం వంటివి చేయరు&period; ఈ మతంలో ఎవరైనా మరణిస్తే పార్సీలోని దఖ్మా అని పిలువబడే టవర్ ఆఫ్ సైలెన్స్ దగ్గరికి తీసుకెళ్తారు&period; అక్కడే దహనం చేస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-50781 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;ratan-tata-3&period;jpg" alt&equals;"how ratan tata cremation done " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మానవ శరీరాన్ని వారు ప్రకృతి బహుమతిగా భావిస్తారు&period; అందుకే శరీరాన్ని తిరిగి ఇచ్చే సంప్రదాయాన్ని పాటిస్తారు&period; దహనం&comma; ఖననం చేయడం వల్ల ప్రకృతి వనరులైన నీరు&comma; గాలి&comma; అగ్ని కలుషితం అవుతాయని జొరాస్ట్రియన్‌à°² విశ్వాసం&period; అందుకే ప్రత్యేక విధానంలో అంత్యక్రియలు చేస్తారు&period; అంత్యక్రియలకు ముందు పార్సీ సంప్రదాయం ప్రకారం ప్రార్థనలు నిర్వహిస్తారు&period; అనంతరం పార్థివదేహాన్ని అంత్యక్రియల కోసం నిర్దేశించిన ప్రత్యేక ప్రదేశానికి తీసుకెళ్తారు&period; దాన్ని టవర్‌ ఆఫ్‌ సైలెన్స్‌ లేదా దఖ్మా అని పిలుస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాబందులు వచ్చి తినేందుకు వీలుగా ఆ ప్రదేశంలో పార్థివదేహాన్ని ఉంచుతారు&period; ఈ మొత్తం పద్ధతిని దోఖ్‌మేనాశీనిగా పేర్కొంటారు&period; మన దేహం ప్రకృతి నుంచి వచ్చింది అలాగే తిరిగి ఐక్యమవ్వాలని వీరి ఆశయం&period;పార్సీల సంప్రదాయం ఇలా ఉన్నప్పటికీ మారుతున్న పర్యావరణ పరిస్థితులు&comma; రాబందుల సంఖ్య తగ్గిపోవడం వంటి సమస్యల కారణంగా దఖ్మా పద్ధతిలో అంత్యక్రియలు కష్టంగా మారింది&period; దీంతో సోలార్‌ లేదా విద్యుత్‌ విధానంలో దహన వాటికల్లోనే పార్సీలు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు&period; నీరు&comma; అగ్ని&comma; నేల కాలుష్యం కాకుండా జొరాస్ట్రియన్‌ నియమాలకు అనుగుణంగానే అంతిమ సంస్కారాలు కొనసాగిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Sam

Recent Posts