ఆధ్యాత్మికం

బిళ్వ వృక్షానికి పూజ‌లు చేస్తే స‌క‌ల పాపాలు పోతాయి.. ఎంతో పుణ్యం ల‌భిస్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకరోజు వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీహరికి సేవలు చేస్తుండగా&comma; సంతుష్టుడైన శ్రీహరి&comma; ఏం వరం కావాలో కోరుకోమన్నాడు&period; అందుకామె ఏ భార్య అయినా భర్త అనురాగాన్నే కోరుకుంటుంది&period; మీ అనురాగం నాకు పుష్కలంగా లభిస్తున్నప్పుడు&comma; నాకంటే అదృష్టవంతురాలెవరు ఉంటుంది&period; చెప్పండి&quest; అని చెప్పింది&period; ఆమె మాటలను విన్న శ్రీహరి&comma;ఆమెకు పరమేశ్వరాను గ్రహం కూడా కావాలని&comma; ఆయనను ప్రసన్నం చేసుకోమని చెబుతాడు&period; తద్వారా&comma; ఓ లోకోపకారం కూడ జరుగనున్నదని శ్రీహరి పలుకుతాడు&period; అలా శ్రీహరి అనుజ్ఞను పొందిన లక్ష్మీదేవి&comma; భూలోకానికి చేరుకుని తపస్సు చేసుకునేందుకు తగిన స్థలాన్ని వెదుకుతుండగా&comma; అటుగా వచ్చిన నారదుడు అనువైన చోటును చూపిస్తాడు&comma; ఆయన సూచన ప్రకారం&comma; శ్రీశైల క్షేత్ర సమీపంలోని పాతాళగంగను చేరుకుని ఓ అశ్వత్థ వృక్షం నీడన తపస్సు మొదలు పెట్టింది&period; అయితే&comma; తపస్సును ప్రారంభించే ముందు గణపతిని ప్రార్థించకుండా పొరపాటు చేసింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందుకు కోపగించుకున్న వినాయకుడు&comma; లక్ష్మీదేవి తపస్సుకు ఆటంకం కలిగించమని సరస్వతీదేవిని ప్రార్థిస్తాడు&period; గణనాథుని విన్నపం మేరకు&comma; తన అత్తగారి తపస్సుకు విఘ్నాలు కలుగజేయసాగింది సరస్వతీదేవి&period; లక్ష్మీదేవి ఎంతగా శివపంచాక్షరీ జపం చేద్దామనుకున్నప్పటికీ తపస్సుపై ఆమె మనసు లగ్నం కాకపోవడంతో&comma; దివ్యదృష్టితో అసలు సంగతిని గ్రహించిన లక్ష్మీదేవి&comma; వినాయక వ్రతాన్ని చేసి&comma; ఆయన అనుగ్రహాన్ని పొందుతుంది&period; ఆనాటి నుంచి వాయుభక్షణం చేస్తూ ఘోరతపస్సు చేయసాగింది లక్ష్మీదేవి&period; అయినా పరమేశ్వరుడు ప్రత్యక్షం కాలేదు&period; ఆమె చుట్టూ పుట్టలు పెరిగి&comma; అనంతరం ఆమె దేహం నుండిదివ్యతేజోమయ అగ్ని బయల్వెడలి సమస్తలోకాలను దహించడానికి బయలుదేరింది&period; ఇది చూసిన ఋషులు&comma; దేవతలు పరమేశ్వరునికి మొరపెట్టుకున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-81000 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;bilva-tree&period;jpg" alt&equals;"do pooja to bilva tree to get rid of all sins " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పుడు పరమశివుడు నందీశ్వరుని భూలోకానికి పంపాడు&period; ఒక బ్రాహ్మణుని వేషంలో లక్ష్మీదేవి వద్దకు వచ్చిన నందీశ్వరుడు&comma; ఆమె మనోభీష్టం నెరవేరాలంటే రుద్రహోమం చేయాలని&comma; అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోమని&comma; అయితే స్వామి నివేదనకు ఒక శరీరావయవాన్ని సమర్పించాలని చెప్పి వెళ్ళిపోయాడు&period; వెంటనే లక్ష్మీదేవి సప్తర్షులను ఋత్విక్కులుగా నియమించుకుని ఏకాదశ రుద్ర యాగాన్ని ప్రారంభించింది&period; యాగం నిర్విఘ్నంగా ముగియడంతో&comma; హోమగుండం నుంచి ఓ వికృత శక్తి స్వరూపం బయటకు వచ్చి ఆకలి&excl; ఆకలి&excl;&excl; అని కేకలు వేయ సాగింది&period; అప్పుడు లక్ష్మీదేవి ఖడ్గంతో తన వామభాగపు స్తనాన్ని ఖండించి&period; శక్తికి సమర్పించబోగా&comma; ఆ శక్తిస్థానంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై&comma; లక్ష్మీదేవిని కరుణించి&comma; ఆమె వక్షభాగంలో ఎలాంటి లోపం లేకుండా చేసి&comma; వరం కోరుకోమన్నాడు&period; అప్పుడామె సర్వవేళలా తనకు శివానుగ్రహం కావాలని ప్రార్థించింది&period; అందుకు ప్రసన్నుడైన పరమశివుడు&comma; తథాస్తు&excl; నీవు విష్ణు వక్షః స్థలంలో స్థిరంగా ఉంటావు&period; నీ నామాల్లో విష్ణు వక్షఃస్థల స్థితాయ నమః అని స్తుతించిన వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి&period; నీ నివేదిత స్థనాన్ని ఈ హోమగుండం నుంచి ఓ వృక్షంగా సృష్టిస్తున్నాను&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని భూలోకవాసులు బిల్వవృక్షమని పిలుస్తారు&period; మూడుదళాలతో ఉండే మారేడు దళాలలో పూజించేవారికి సర్వశుభాలు కలుగతాయి అని దీవించాడు&period; ఇలా బిల్వవృక్షం పరమశివుని సేవ కొరకై భూలోకంలో సృష్టించబడింది&period; బిల్వ వృక్షాన్ని దర్శించిన&comma; స్పర్శించినా సమస్త పాపాలు పోతాయని ప్రీతీతి&period; అంతేకాదండోయో ఈ మారేడుదళాలు&comma; మారేడు కాయలు&comma; బెరడు పలు రోగాలు నయం చేయడానికి ఉపయోగిస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts