ఆధ్యాత్మికం

ఈ ఆల‌యంలోకి మ‌హిళ‌లు అందుక‌నే వెళ్ల‌కూడ‌దు.. వెళ్తే ఏం జ‌రుగుతుంది అంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్ని ఆలయాల్లోకి మహిళలు వెళ్లకూడదు అంటారు&period; అలాగే కొన్ని ఆలయాలకు పురుషులు వెళ్లకూడదు&period; ఇలాంటి నియమాలు మన దేశంలో ఇంకా కొన్ని ఆలయాలకు ఉన్నాయి&period; అందులో ఒకటి కేరళలోని శబరిమల ఆలయం&period; జమ్ము కశ్మీర్‌లోని వైష్ణో దేవి ఆలయంలో కూడా ఇలాంటి ఆంక్షలు మహిళలపై ఉంటాయి&period; హర్యానాలో కూడా ఒక టెంపుల్‌లో ఆడవారికి ప్రవేశం లేదు&period; మహాభారత యుద్ధం జరిగిన పవిత్ర నగరంగా చెప్పుకునే కురుక్షేత్రంలో ఈ దేవాలయం ఉంది&period; హర్యానా రాష్ట్రంలో ఉన్న ఈ నగరంలోనే శ్రీకృష్ణుడు అర్జునుడికి తన పవిత్రమైన జ్ఞానాన్ని బోధించాడట&period; కురుక్షేత్రంలో చాలా దేవాలయాలు ఉన్నాయి&comma; కానీ వాటిలో ఒక దేవాలయంలోకి మహిళలను అడుగుపెట్టనివ్వరు&period; ఈ టెంపుల్ మహిళలకు చాలా అశుభమైనదిగా భావిస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇది ధర్మనగరి కురుక్షేత్రం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెహోవాలో ఉంది&period; దీనిని శివుని కుమారుడైన కార్తికేయకు అంకితం చేశారు&period; ఈ దేవాలయంలోకి మహిళల ప్రవేశం నిషిద్ధం&period; ఈ గుడి ఢిల్లీ నుంచి 200 కిలోమీటర్లు&comma; కర్నాల్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది&period; ఇది పంజాబ్ సరిహద్దుకు దగ్గరగా ఉంటుంది&period; కార్తికేయ టెంపుల్‌లో అడుగుపెట్టిన ప్రతి మహిళ వితంతువుగా శాపానికి గురవుతుందని నమ్ముతారు&period; ఇలా ఎందుకు జరుగుతుందో చెప్పే స్టోరీలు చాలా ఉన్నాయి&period;&period; ఒక కథనం ప్రకారం&comma; ఒక మహిళ ఒకరోజు ఆలయంలోకి ప్రవేశించి&comma; అనుకోకుండా శివుని పవిత్రమైన శివలింగాన్ని తాకుతుంది&period; దానితో అపవిత్రమయ్యానని శివునికి బాగా కోపం వస్తుంది&period; ఆ కోపంలో పరమేశ్వరుడు ఆ స్త్రీని వితంతువుగా ఉండమని శపిస్తాడట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91019 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;pehowa-temple&period;jpg" alt&equals;"pehowa temple in haryana no entry for women " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మరొ కథనం ప్రకారం&comma; పూర్వకాలంలో మహిళల గుంపు గుడిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా&comma; వారిని ఒక పురుషుల గుంపు అడ్డుకుంది&period; పీరియడ్స్ అంటుతో ఉన్నందున లోనికి అనుమతించడం లేదని&comma; పీరియడ్ బ్లడ్ ఆలయాన్ని అపవిత్రం చేస్తుందని పురుషులు మహిళలకు చెప్పారు&period; అప్పటినుంచి ఇదే నిబంధన కొనసాగుతోంది&period; ఈ ఆలయంలో కార్తికేయ స్వామి పవిత్రమైన బ్రహ్మచారి రూపాన్ని పూజిస్తారు&period; అందుకే ఈ గుడిలోకి ప్రవేశించడానికి మహిళలకు అనుమతి లేదని అంటారు&period; ఒకవేళ ఆడవారు ఈ దేవాలయంలోకి అడుగు పెడితే&comma; వారు ఏడు జీవితాల పాటు వితంతువు జీవితాన్ని గడిపే శాపం తగులుతుందట&period; టెంపుల్ బయట ఆడవారికి ప్రవేశం నిషేధమని తెలిపే ఒక బోర్డు కూడా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ఆలయంలో కార్తికేయుడికి ఆవాల నూనె సమర్పిస్తారు&period; కార్తికేయుడు తన తల్లి పార్వతిపై కోపం తెచ్చుకొని తన రక్తాన్ని&comma; మాంసాన్ని అగ్నికి అర్పించాడు&period; దీంతో అప్పుడు పెహోవా తీర్థయాత్రను సందర్శించమని శివుడు కార్తికేయుడికి చెప్పాడు&period; ఋషులు కార్తికేయుని మండుతున్న శరీరానికి ఆవనూనె పూసి చల్లదనాన్ని అందించారు&period; కార్తికేయుడు శాంతిస్తాడు&period; పెహోవా వద్ద పవిత్రమైన రాయి రూపంలో స్థిరపడ్డాడు&period; అందుకే ఇక్కడి దేవతా మూర్తికి ఆవ నూనె సమర్పిస్తారట&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts