వినోదం

అల్లు అర్జున్ న‌టించిన ఈ రెండు సినిమాల‌లోని కామ‌న్ పాయింట్ గుర్తించారా..!

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన‌ అల వైకుంఠపురములో సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. 2020 జనవరి 12న సంక్రాంతికి ఈ మూవీని విడుదల కాగా, ఇది ప్రతి ఒక్క‌రిని ఎంత‌గానో అల‌రించింది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన‌ మూడో సినిమా ఇది. గతంలో జులాయి, S/O సత్యమూర్తి సినిమాలు వచ్చాయి. వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా మీద మరింత అంచనాలు ఉండ‌గా, ఆ అంచ‌నాలకి తగిన‌ట్టే సినిమా రూపొందించారు. ఈ మూవీలో కూడా తండ్రి సెంటిమెంట్ ఈ చిత్రంలో హైలైట్ అయింది.

అల వైకుంఠ‌పుర‌ములో సినిమాలో తనకు బలంగా ఉన్న ఎమోషన్స్ ఈ సినిమాలో చూపించి అల‌రించాడు. ఇక జులాయి సినిమా విష‌యానికి వ‌స్తే ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ మైండ్ గేమ్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. అంతేకాకుండా అదే రేంజ్ లో సోనూసూద్ సైతం విలనిజం ప్రదర్శించడం ఈ సినిమాకు మరో హైలెట్. ఈ సినిమాలోని డైలాగులు పాటలు ఇలా ప్రతి ఒక్కటి ప్రేక్షకులను ఎంతగానో అల‌రించాయి.అయితే అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంతో పాటు జులాయి సినిమాలో ఓ కామ‌న్ పాయింట్ ఉంది.

have you observed this common point in allu arjun 2 movies

ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం పెరగడంతో రెండు సినిమాల‌లో ఉన్న చిన్న‌ పాయింట్ ను గమనించిన నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ కామన్ పాయింట్ ఏంటంటే జులాయి సినిమాలో బ్రహ్మాజీ ఓ ట్రావెల్ ఏజెన్సీని కలిగి ఉంటాడు. దాని పేరు “ప్యాక్ యువర్ బ్యాగ్స్” అయితే అదే విధంగా అలా వైకుంఠపురం సినిమాలోను మనకు పాక్ యువర్ బ్యాగ్స్ అనే కంపెని కనిపిస్తుంది. అలా రెండు సినిమాల్లో ఓకే కంపెనీ పేరు ఉండడంతో ఈ కామన్ పాయింట్ ని ప‌ట్టుకొని నెటిజ‌న్స్ సోష‌ల్ మీడియాలో తెగ ర‌చ్చ చేస్తున్నారు.

Admin

Recent Posts