Kidney Stones Ayurvedic Remedies : కిడ్నీల్లో రాళ్ల‌ను క‌రిగించే.. ఆయుర్వేద చిట్కాలు..!

Kidney Stones Ayurvedic Remedies : మ‌న‌లో చాలా మంది మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రిని ఈ స‌మస్య వేధిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. మూత్ర‌పిండాలల్లో రాళ్ల కార‌ణంగా విప‌రీత‌మైన నొప్పి, తీవ్ర‌మైన బాధ క‌లుగుతుంది. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు, నీటిని ఎక్కువ‌గా తాగ‌క‌పోవ‌డం వంటి వివిధ కార‌ణాల చేత ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. సాధార‌ణంగా ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డాలంటే శ‌స్త్ర‌చికిత్స ఒక్క‌టే మార్గ‌మ‌ని చాలా మంది భావిస్తారు. కానీ కొన్ని ఆయుర్వేద చిట్కాల‌ను ఉప‌యోగించి కూడా మూత్ర‌పిండాల్లో రాళ్ల‌ను మ‌నం తొల‌గించుకోవ‌చ్చు.

ఈ చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు ఉండ‌వు. ఈ చిట్కాల‌ను త‌యారు చేసుకోవ‌డం అలాగే వాడ‌డం కూడా చాలా సుల‌భం. మూత్ర‌పిండాల్లో రాళ్ల‌ను క‌రిగించే ఆయుర్వేద చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మూత్ర‌పిండాల్లో రాళ్ల‌ను క‌రిగించ‌డంలో ర‌ణ‌పాల ఆకు మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. ముందుగా ఒక ర‌ణ‌పాల ఆకుల‌ను రోట్లో వేసి మెత్త‌గా దంచాలి. త‌రువాత ఇందులోనే 3 మిరియాలు, 3 వెల్లుల్లి రెబ్బ‌లు వేసి మెత్త‌గా దంచి ఈ మిశ్ర‌మం నుండి ర‌సాన్ని తీయాలి. ఇలా త‌యారు చేసుకున్న ర‌సాన్ని 50 ఎమ్ ఎల్ మోతాదులో రోజూ ఉదయం ప‌ర‌గ‌డుపున తీసుకోవ‌డం వ‌ల్ల 15 నుండి 20 రోజుల్లోనే మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మ‌స్య త‌గ్గుతుంది.

Kidney Stones Ayurvedic Remedies in telugu must know about them
Kidney Stones Ayurvedic Remedies

అలాగే మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు కొండ‌పిండి ఆకును ఉప‌యోగించ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. కొండ‌పిండి ఆకును వేర్ల‌తో స‌హా తీసుకుని ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత ఈ ముక్క‌ల‌ను దంచి గిన్నెలో వేసి లీట‌ర్ నీటిని పోసి మ‌రిగించాలి. ఈ లీట‌ర్ నీరు పావు లీట‌ర్ అయ్యే వ‌ర‌కు బాగా మ‌రిగించి వ‌డ‌క‌ట్టాలి. త‌రువాత ఈ నీటిలో ప‌టిక బెల్లం వేసి క‌లిపి ప‌ర‌గడుపున తాగాలి. ఇలా కొండ‌పిండి ఆకుతో క‌షాయాన్ని త‌యారు చేసుకుని క్ర‌మం త‌ప్ప‌కుండా తీసుకోవ‌డం వ‌ల్ల చాలా త‌క్కువ స‌మ‌యంలోనే మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మ‌స్య త‌గ్గుతుంది. అలాగే అర‌టి చెట్టు లోప‌ల ఉండే భాగాన్ని సేక‌రించి దంచి ర‌సాన్ని తీయాలి.

ఈ ర‌సాన్ని త‌గిన మోతాదులో రోజూ తాగ‌డం వ‌ల్ల మూత్రపిండాల్లో రాళ్ల స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. అలాగే ప‌ల్లేరు కాయ తీగ‌ను సేక‌రించి దంచి నీటిలో వేసి మ‌రిగించాలి. త‌రువాత ఈ నీటిని వ‌డ‌క‌ట్టి ప‌ర‌గ‌డుపున తాగాలి. ఇలా తాగ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మ‌స్య చాలాసుల‌భంగా త‌గ్గుతుంది. ఈ విధంగా మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఈ ఆయుర్వేద చిట్కాల‌ను వాడ‌డం వ‌ల్ల శ‌స్త్ర‌చికిత్స‌తో అవ‌స‌రం లేకుండా స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts