inspiration

రైలు లోంచి వాటర్ బాటిల్ విసిరితే ఏమవుతుంది.. తెలిస్తే, ఇంకెప్పుడూ అలా చెయ్యరు!

మీకు బస్సు ఎక్కడం ఇష్టమా? రైలు ఎక్కడం ఇష్టమా? అంటే.. చాలా మంది రైలే అంటారు. కారణం.. మన భారతీయ రైళ్లలో ఏదో తెలియని ఆనందం ఉంటుంది. ఎప్పుడూ రద్దీగా ఉండే రైల్వేస్టేషన్లు, అక్కడ రైలు కోసం ఎదురుచూడటాలు, రైలు వచ్చాక, సీటు కోసం తాపత్రయ పడటం, సామాన్లను జాగ్రత్తగా కింద పెట్టుకోవడం, ఆ తర్వాత రైలు కదలగానే.. అలా కిటికీ వైపు చూస్తూ ఉంటే, చెట్లన్నీ వెనక్కి వెళ్లిపోతూ.. మనం ముందుకి వెళ్లిపోతూ ఉంటే.. ఆ దృశ్యాలు మన మైండ్‌లో నిండిపోతాయి. ఇక స్టేషన్ల దగ్గర తినుబండారాలు కొనుక్కోవడం, పక్క ప్రయాణికులతో ముచ్చట్లు ఇవన్నీ.. ఎప్పటికీ గుర్తుంటాయి. ఐతే.. రైలు ప్రయాణంలో మనం ఒక పెద్ద తప్పు చేస్తూ ఉంటాం. ఏంటంటే.. వాటర్ బాటిల్‌లో వాటర్ తాగిన తర్వాత, ఖాళీ బాటిల్‌ని రైలు కిటికీ నుంచి బయటకు విసిరేస్తాం. ఎందుకంటే.. ఏం కాదులే అనే ఫీలింగ్.

అది సమస్య అవుతుంది అని మనలో చాలా మందికి తెలియదు. అందుకే అలా చేస్తాం. అందుకే ఈ విషయంపై ప్రయాణికుల్ని అలర్ట్ చేస్తూ.. తూర్పు రైల్వే.. ఓ వీడియోని షేర్చేసింది. అది ప్రయాణికుల్ని ఆలోచింపజేస్తోంది. ఆ వీడియోలో రైలు వెళ్తుండగా.. ఓ ప్రయాణికుడు.. ఖాళీ వాటర్ బాటిల్‌ని బయటకు విసిరేశాడు. అది పట్టాలపై పడి.. పట్టాల మధ్యలో ఇరుక్కుపోయింది. ఆ తర్వాత స్టేషన్ మాస్టర్‌కి అదే ట్రాక్‌పై వస్తున్న రైలు లోకో పైలట్ నుంచి కాల్ వచ్చింది. తాను ఆ ట్రాక్‌పై రావచ్చా అని అడిగితే.. స్టేషన్ మాస్టర్.. రావచ్చు అని చెబుతారు. కానీ అంతలోనే.. అక్కడ పట్టాలపై ఏదో సమస్య ఉంది అని సిగ్నల్ అలర్ట్ చూపిస్తుంది. అది చూసిన స్టేషన్ మాస్టర్.. అక్కడ ఏమైందో చెక్ చెయ్యమని రైల్వే ఉద్యోగులను పంపిస్తారు. ఆ ఉద్యోగులు.. అక్కడికి వెళ్లి చూడగా.. పట్టాల మధ్యలో ఇరుక్కుపోయిన వాటర్ బాటిల్ కనిపించింది. దాన్ని వారు జాగ్రత్తగా అక్కడి నుంచి తొలగించారు.

do not throw away water bottles from train know why

మనం ఖాళీ బాటిలే కదా అనుకుంటే.. అది పట్టాలపై ఎంత సమస్య అయ్యిందో ఈ వీడియో చూపిస్తోంది. అందుకే రైలు కోచ్‌లలో వ్యర్థాలను.. అదే కోచ్‌లో ఉండే డస్ట్ బిన్‌లలో వెయ్యాలే తప్ప.. కిటికీ నుంచి బయటకు విసిరేయకూడదు. దీని వల్ల రైలు ప్రయాణాలు ఆలస్యం అవుతున్నాయి. రోజూ దేశవ్యాప్తంగా కొన్ని లక్షల బాటిళ్లను ఇలాగే విసిరేస్తున్నారు. ఇవి పట్టాలపై పెను సమస్యగా మారుతున్నాయి. అందుకే ఇకపై ఇలా చెయ్యవద్దు అని వీడియోలో సూచించారు. చూశారుగా.. ఇప్పుడు మీకు ఏమనిపిస్తోంది. ఇకపై రైలు నుంచి వాటర్ బాటిళ్లే కాదు.. వేస్ట్ ఏదీ పారేయకూడదు అనిపిస్తోందా? అలా అనిపిస్తే, రైల్వే అధికారుల ప్రయత్నం ఫలించినట్లే. మన ఇంట్లో అంతా శుభ్రంగా ఉండాలని కోరుకుంటాం. మన దేశం కూడా శుభ్రంగా ఉండాలంటే.. అది మన చేతుల్లోనే ఉంది. డస్ట్ బిన్‌లోనే తుక్కు వేసే, చిన్న ప్రయత్నం.. పెద్ద ఫలితం ఇస్తుంది. వేస్ట్ అంతా.. పద్ధతి ప్రకారం మేనేజ్ అవుతుంది.

పట్టాలపై తుక్కు వేస్తే.. అది అక్కడే పోగై.. అనేక రకాల సమస్యలకు కారణం అవుతుంది. అందుకే స్వచ్ఛ భారత్‌లో మనమంతా కలిసి పనిచెయ్యాలి. మనందరి బాధ్యతాయుత చర్యలు.. మన దేశాన్ని అందంగా, సుందరంగా మార్చుతాయి. అంతే కదా.

Admin

Recent Posts