Water Drinking : అధిక దాహంతో తరచూ నీళ్లు తాగుతున్నారా.. అయితే ఇవే కారణాలు కావచ్చు..!

Water Drinking : సాధారణంగా నీరు ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెబుతుంటారు. ఈ క్రమంలోనే రోజుకు ఆరు నుంచి ఏడు గ్లాసుల నీటిని తాగాలని సూచిస్తుంటారు. మన శరీరానికి సరిపడా నీటిని తాగటం వల్ల మనం తీసుకునే ఆహార పదార్థాలు తొందరగా జీర్ణం అవ్వడమే కాకుండా మన శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడంలో నీరు ఎంతో ఉపయోగపడుతుంది.

Water Drinking : అధిక దాహంతో తరచూ నీళ్లు తాగుతున్నారా.. అయితే ఇవే కారణాలు కావచ్చు..!

అయితే కొందరు మాటిమాటికీ అవసరానికి మించి నీటిని తాగుతూ ఉంటారు. ఇలా అధిక దాహంతో తరచూ నీళ్లు తాగే వారిలో కొన్ని రకాల వ్యాధులు ఉంటాయి. ఆ వ్యాధుల వల్లే వారు నీళ్లను అవసరం లేకున్నా అధికంగా తాగుతుంటారు. మరి వారు ఎందుకు ఇలా నీళ్లను తాగుతారో ఇప్పుడు తెలుసుకుందామా..!

మాటిమాటికీ నీళ్లను తాగుతున్నారంటే షుగర్‌ సమస్య అయి ఉంటుంది. లేదా షుగర్‌ సమస్య ప్రారంభంలో ఉండి ఉంటుంది. అందుకనే దాహం ఎక్కువగా అవుతుంది. కనుక నీళ్లను ఎక్కువగా తాగుతారు. మాటిమాటికి నీళ్లను తాగే వారిలో మధుమేహం వచ్చే అవకాశాలు ఉంటాయి. అవసరానికి మించి దాహం వేస్తున్న వారిలో భవిష్యత్తులో షుగర్ వ్యాధి బారిన పడే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతమున్న జీవనశైలిలో భాగంగా అధిక మొత్తంలో చక్కెర పదార్థాలను తీసుకోవడం వల్ల తరచూ దాహం వేస్తుంది. శరీరానికి సరిపడా నీరు లేకపోవడం వల్ల మూత్ర పిండాల పనితీరు తగ్గిపోతుంది. ఈ క్రమంలో షుగర్‌ వస్తుంది. కనుక ఎందుకైనా మంచిది షుగర్ టెస్ట్‌ చేయించుకోవడం ఉత్తమం.

కొన్నిసార్లు మనం అధిక కారం కలిగిన ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు ఆహార పదార్థాలు తేలికగా జీర్ణం కావు. అలాంటి సమయంలో ఎక్కువగా నీరు అవసరం అవుతుంది కనుక అధిక మొత్తంలో దాహం వేస్తుంది. అందుకనే నీళ్లను తాగుతాం. ఇది తాత్కాలికమైనదే. కనుక ఇలాంటి సందర్భంలో నీళ్లను అధికంగా తాగుతుంటే ఖంగారు పడాల్సిన పనిలేదు.

ఇక మన శరీరానికి నీరు అవసరం అయినప్పుడు విపరీతంగా చెమటలు పడతాయి. ఈ క్రమంలోనే శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడానికి నీటిని తాగాల్సి ఉంటుంది. ఇక చాలామంది ఏదైనా కంగారుగా లేదా ఆందోళనకరమైన విషయాలు విన్నప్పుడు నోరు మొత్తం పొడిబారిపోతుంది. ఈ సమయంలో అధికంగా దాహం వేస్తూ ఉంటుంది. ఇలా శరీరానికి సరిపడా నీటి కన్నా అధికంగా తాగినప్పుడు మీరు మధుమేహంతో, జీర్ణ క్రియ సమస్య లేదా ఏదైనా ఆందోళనలో ఉన్నారని, అందుకనే నీళ్లను తాగుతున్నారని స్పష్టమవుతుంది.

అదేవిధంగా నూనె పదార్థాలను ఎక్కువగా తిన్నప్పుడు కూడా దాహం వేస్తుంది. ఈ సందర్భంలోనూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇవి కాకుండా సాధారణ సమయంలోనూ నీళ్లను ఎక్కువగా తాగుతున్నారంటే.. అనుమానించాల్సిందే. వెంటనే డాక్టర్‌ను కలసి పరీక్షలు చేయించుకుని అవసరం అయితే చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.

Share
Sailaja N

Recent Posts