Chole Masala Curry : చోలే మసాలా క‌ర్రీ త‌యారీ ఇలా.. చ‌పాతీల్లోకి అదిరిపోతుంది..

Chole Masala Curry : ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉండే ఆహారాల్లో కాబూలీ శ‌న‌గ‌లు కూడా ఒక‌టి. వీటిని మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కేవ‌లం ప్రోటీన్లే కాకుండా వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. ఈ శ‌న‌గ‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అందులో భాగంగా అన్నం, చ‌పాతీల్లోకి తినేలా కాబూలీ శ‌న‌గ‌ల‌తో మ‌సాలా కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

చోలే మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కాబూలీ శ‌న‌గ‌లు – 100 గ్రా., జీడిప‌ప్పు – పావు క‌ప్పు, ఎండుకొబ్బ‌రి పొడి – పావు క‌ప్పు, ప‌చ్చిమిర్చి – 2, నూనె – పావు క‌ప్పు, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, జీల‌కర్ర – ఒక టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెబ్బ‌, పెద్ద ట‌మాటాలు – 2, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Chole Masala Curry recipe in telugu know how to make it
Chole Masala Curry

చోలే మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా శ‌న‌గ‌ల‌ను రాత్రంతా బాగా నాన‌బెట్టాలి. త‌రువాత వాటిని ఒక కుక్క‌ర్ లో వేసి కొద్దిగా ఉప్పు, 3 క‌ప్పుల నీళ్లు పోసి మూత పెట్టి 3 నుండి 4 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించాలి. ఇప్పుడు క‌ళాయిలో జీడిప‌ప్పు వేసి చిన్న మంట‌పై దోర‌గా వేయించాలి. త‌రువాత ఎండు కొబ్బ‌రి పొడి వేసి దోర‌గా వేయించి ఒక జార్ లోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులోనే ప‌చ్చిమిర్చి వేసి కొద్దిగా నీటిని పోసి మెత్త‌గా పేస్ట్ లా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్క‌లు వేసి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు బాగా వేయించాలి. త‌రువాత అల్లం పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ప‌సుపు, కారం, ఉప్పు, గ‌రం మ‌సాలా, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి వేసి క‌ల‌పాలి.

ఇందులో క‌రివేపాకు, అర‌ టీ గ్లాస్ నీటిని పోసి నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ట‌మాటాల‌ను ఫ్యూరీ గా చేసి వేసుకుని నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న జీడిప‌ప్పు, ఎండు కొబ్బ‌రి పేస్ట్ వేసి క‌ల‌పాలి. దీనిని మూడు నుండి నాలుగు నిమిషాల పాటు బాగా వేయించిన త‌రువాత ఉడికించిన కాబూలీ శన‌గ‌ల‌ను నీటితో స‌హా వేసుకోవాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. చివ‌ర‌గా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చోలే మ‌సాలా క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, పూరీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. దీనిని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

Share
D

Recent Posts