Dondakaya Masala Kura : దొండ‌కాయ మసాలా కూర‌ను ఇలా చేసి తింటే.. బగారా అన్నంలోకి సూప‌ర్‌గా ఉంటుంది..

Dondakaya Masala Kura : దొండ‌కాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. దొండ‌కాయ‌ల‌తో చేసే కూర‌లు ఎంతో రుచిగా ఉన్న‌ప్ప‌టికి చాలా మంది వీటిని తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. కానీ దొండ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల కూడా మ‌నం ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. దొండ‌కాయ‌ల‌ను తిన‌ని వారు కూడా లొట్ట‌లేసుకుంటూ తినేలా వీటితో మ‌నం మ‌సాలా కూర‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. దొండ‌కాయ‌ల‌తో ఎంతో రుచిగా ఉండే మ‌సాలా కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీక కావ‌ల్సన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

దొండ‌కాయ మ‌సాలా కూర త‌యారీకి కావ‌ల్సిన‌ప‌దార్థాలు..

దొండ‌కాయ‌లు – పావు కిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, నాన‌బెట్టిన చింత‌పండు – కొద్దిగా, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక‌టేబుల్ స్పూన్ లేదా త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ఆవాలు – అర టీ స్పూన్.

Dondakaya Masala Kura recipe in telugu better for bagara rice
Dondakaya Masala Kura

మ‌సాలా పేస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌ల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు – అర క‌ప్పు, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, గ‌స‌గ‌సాలు – ఒక టేబుల్ స్పూన్, ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్.

దొండ‌కాయ మ‌సాలా కూర త‌యారీ విధానం..

ముందుగా దొండ‌కాయ‌ల‌ను శుభ్రంగా క‌డిగి చివ‌ర్ల‌ను తొల‌గించాలి. త‌రువాత వీటిని గుత్తి వంకాయ‌ల‌ను క‌ట్ చేసిన‌ట్టుగా నిలువుగా నాలుగు ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత ఒక క‌ళాయిలో ప‌ల్లీలు, ధ‌నియాలు, నువ్వులు, గ‌స‌గ‌సాలు, జీల‌క‌ర్ర‌, ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు వేసి దోర‌గా వేయించుకోవాలి. త‌రువాత వీటిని ఒక జార్ లో వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి పేస్ట్ గా చేసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక క‌ట్ చేసిన దొండ‌కాయ‌ల‌ను వేసి వేయించుకోవాలి. వీటిని పూర్తిగా వేయించిన త‌రువాత ఒక ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో ఆవాలు, జీల‌క‌ర్ర, క‌రివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.

ఇవి వేగిన త‌రువాత మ‌సాలా పేస్ట్, ఉప్పు, కారం, ప‌సుపు, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు బాగా వేయించాలి. త‌రువాత వేయించిన దొండ‌కాయ‌లు, చింత‌పండు రసం, అర గ్లాస్ నీళ్లు వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించాలి. చివ‌ర‌గా కొత్తిమీర‌ను చల్లి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే దొండ‌కాయ మ‌సాలా కూర త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. దొండ‌కాయ‌ల‌ను తిన‌ని వారు కూడా ఈ దొండ‌కాయ మ‌సాలా కూర‌ను ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts