Fish Biryani : రెస్టారెంట్ల‌లో అందించే ఫిష్ బిర్యానీ.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసేయండి..!

Fish Biryani : మ‌నం చేప‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటితో ర‌క‌ర‌కాల వెరైటీ వంట‌కాల‌ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము. చేప‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఫిష్ ధ‌మ్ బిర్యానీ కూడా ఒక‌టి. ఇది చాలా రుచిగా ఉంటుంది. మ‌న‌కు ఎక్కువ‌గా రెస్టారెంట్ ల‌లో ల‌భిస్తుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఫంక్ష‌న్ ల‌ల్లో కూడా దీనిని వ‌డిస్తూ ఉంటారు. ఈ ఫిష్ బిర్యానీని రెస్టారెంట్ స్టైల్ లో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. చేప ముక్క‌లు విరగ‌కుండా మ‌రీ మెత్త‌గా కాకుండా ఈ బిర్యానీని మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. ఇత‌ర నాన్ వెజ్ బిర్యానీల కంటే ఈ బిర్యానీని చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. రెస్టారెంట్ స్టైల్ ఫిష్ బిర్యానీని ఇంట్లోనే ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫిష్ ధ‌మ్ బిర్యానీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

స‌న్న‌గా త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు – ఒక క‌ప్పు, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకులు – 2, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 3, యాల‌కులు – 2, అనాస పువ్వు – 1, సాజీరా – అర టీ స్పూన్, జాప‌త్రి – కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, ట‌మాట ఫ్యూరీ – ఒక క‌ప్పు, పెరుగు – అర క‌ప్పు, కారం – ఒక టీస్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, ఉప్పు – కొద్దిగా, పుదీనా – 2 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్.

Fish Biryani recipe make it like restaurant very tasty
Fish Biryani

అన్నం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బాస్మ‌తీ బియ్యం – రెండున్న‌ర గ్లాసులు, నీళ్లు – 5 గ్లాసులు, బిర్యానీ ఆకులు – 2,జాప‌త్రి – కొద్దిగా, మిరియాలు – 12, యాల‌కులు – 3, న‌ల్ల యాల‌క్కాయ – 1, ల‌వంగాలు – 4, సాజీరా – అర టీ స్పూన్, దాల్చిన చెక్క‌- ఒక ఇంచు ముక్క‌, మ‌రాఠీ మొగ్గ‌లు – 2, ఉప్పు – త‌గినంత‌, నెయ్యి – 2 టీ స్పూన్స్, నిమ్మ‌ర‌సం – 2 టీ స్పూన్స్.

మ్యారినేట్ కు కావ‌ల్సిన ప‌దార్థాలు..

చేప ముక్క‌లు – 800 గ్రా., ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక‌టిన్న‌ర టీ స్పూన్స్ లేదా త‌గినంత‌, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, నిమ్మ‌ర‌సం – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్.

ఫిష్ ధ‌మ్ బిర్యానీ త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో చేప ముక్క‌ల‌ను తీసుకోవాలి. త‌రువాత ఇందులో నిమ్మ‌ర‌సం, ప‌సుపు, ఉప్పు, కారం,. ధ‌నియాల పొడి వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత వీటిపై మూత పెట్టి అర‌గంట పాటు నాన‌బెట్టాలి. త‌రువాత గిన్నెలో బాస్మ‌తీ బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా క‌డ‌గాలి.త‌రువాత నీళ్ల‌తో పాటు మిగిలిన ప‌దార్థాల‌న్నీవేసి బియ్యాన్ని అర‌గంట పాటు నాన‌బెట్టాలి. త‌రువాత వెడ‌ల్పుగా ఉండే పెనాన్ని తీసుకుని దానిపై 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి.త‌రువాత మ్యారినేట్ చేసుకున్న చేప ముక్క‌లు వేసి వేయించాలి. వీటిని 5 నిమిషాల పాటు వేయించిన త‌రువాత మ‌రో వైపుకు తిప్పుకుని మ‌రో 5 నిమిషాల పాటు వేయించాలి. చేప ముక్క‌లు క్రిస్పీగా వేగిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి ముక్క‌ల‌ను ప్లేట్ లోకి తీసుకోవాలి.

త‌రువాత చేప ముక్క‌లు వేయించ‌గా మిగిలిన‌ నూనెను వ‌డ‌క‌ట్టి అడుగు మందంగా ఉండే గిన్నెలో వేసుకోవాలి. త‌రువాత ఈ గిన్నెను స్ట‌వ్ మీద ఉంచి స్ట‌వ్ ఆన్ చేయాలి.నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. వీటిని ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించిన త‌రువాత వాటిలో స‌గం ఉల్లిపాయ ముక్క‌ల‌ను ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత నెయ్యి వేసి వేడి చేయాలి. త‌రువాత మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. త‌రువాత ట‌మాట ఫ్యూరీ వేసి వేయించాలి. మ‌సాలా వేగుతుండ‌గానే బియ్యం గిన్నెను స్ట‌వ్ మీద ఉంచి అన్నాన్ని 80 నుండి 90 శాతం వ‌ర‌కు ఉడికించాలి.

ట‌మాట ఫ్యూరీ వేగిన త‌రువాత ఒక గిన్నెలో పెరుగును తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఉప్పు, కారం, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. త‌రువాత ఈ పెరుగును ట‌మాట ఫ్యూరీలో వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత స‌గం గ్రేవీని ప్లేట్ లోకి తీసుకోవాలి. మిగిలిన గ్రేవీని గిన్నె అడుగున స‌మానంగా చేసుకోవాలి. త‌రువాత వేయించిన చేప ముక్క‌ల‌ల్లో స‌గం ముక్క‌ల‌ను వేసుకోవాలి. వీటిపై పుదీనా, కొత్తిమీర వేయించిన ఉల్లిపాయ ముక్క‌లు చ‌ల్లుకోవాలి. త‌రువాత 80 శాతం ఉడికించిన అన్నాన్ని వ‌డ‌క‌ట్టి అందులో స‌గం అన్నాన్ని ఒక లేయ‌ర్ గా వేసుకోవాలి. త‌రువాత మిగిలిన గ్రేవీని, చేప ముక్క‌లను వేసుకోవాలి. త‌రువాత కొత్తిమీర‌, పుదీనా, బ్రౌన్ ఆనియ‌న్స్ చ‌ల్లుకోవాలి. త‌రువాత మిగిలిన అన్నాన్ని వేసి పైన స‌మానంగా చేసుకోవాలి.

త‌రువాత కొత్తిమీర‌, పుదీనా, బ్రౌన్ ఆనియ‌న్స్ వేసుకోవాలి. త‌రువాత ఒక టేబుల్ స్పూన్ క‌రిగించిన నెయ్యిలో ప‌సుపు క‌లిపి పైన చ‌ల్లుకోవాలి. త‌రువాత మ‌రో రెండు టేబుల్ స్పూన్ల నీటిని గిన్నె అంచుల వెంబ‌డి వేసుకోవాలి. త‌రువాత గిన్నెపై సిల్వ‌ర్ పాయిల్ ను ఉంచి మూత పెట్టుకోవాలి. త‌రువాత దీనిని స్ట‌వ్ మీద ఉంచి 7 నుండి 10 నిమిషాల పాటు చిన్న మంట‌పై ద‌మ్ చేసుకోవాలి. త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి మ‌రో 10 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ త‌రువాత స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఫిష్ ధ‌మ్ బిర్యానీ త‌యార‌వుతుంది. ఈ విధంగా త‌యారు చేసిన ఫిష్ ధ‌మ్ బిర్యానీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts