Mutton Keema Curry : మ‌ట‌న్ కీమా క‌ర్రీని ఇలా చేయ‌వ‌చ్చు.. రుచి చూశారంటే.. విడిచిపెట్ట‌రు..

Mutton Keema Curry : మ‌నం మ‌ట‌న్ కీమాను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మాంసాహార ప్రియుల‌కు దీని రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. మ‌ట‌న్ కీమాతో మ‌నం ఎక్కువ‌గా కూర‌ను త‌యారు చేస్తూ ఉంటాం. మ‌ట‌న్ కీమాతో చేసే కూర చాలా రుచిగా, ఘుమ‌ఘుమ‌లాడుతూ ఉంటుంది. ఈ కూర‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. బ్యాచిల‌ర్స్, వంట‌రాని వారు ఎవ‌రైనా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌ట‌న్ కీమాతో రుచిగా కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి..త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి…అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌ట‌న్ కీమా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మ‌ట‌న్ కీమా – 300 గ్రా., అల్లం వెల్లుల్లి పేస్ట్ – రెండు టీ స్పూన్లు, ప‌సుపు – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – 3 టీ స్పూన్స్, పెరుగు – పావు క‌ప్పు, బ‌ట‌ర్ – 2 టీ స్పూన్స్, నూనె – 2 టీ స్పూన్స్, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, చిన్న‌గా త‌రిగిన ట‌మాటాలు – 3, జీల‌క‌ర్ర పొడి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Mutton Keema Curry recipe in telugu make in this method
Mutton Keema Curry

మ‌సాలా పొడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ధ‌నియాలు – రెండు టీ స్పూన్లు, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, మిరియాలు – 8, ల‌వంగాలు – 4, యాల‌కులు – 3, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ఎండుమిర్చి – 3, బిర్యానీ ఆకులు – 2.

మ‌ట‌న్ కీమా త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో ఎండుమిర్చి త‌ప్ప మిగిలిన మ‌సాలా ప‌దార్థాల‌న్నీ వేసి బాగా వేయించాలి. త‌రువాత ఎండుమిర్చిని కూడా వేసి వేయించాలి. ఈ దినుసుల‌న్నీ చ‌క్క‌గా వేగిన త‌రువాత వీటిని జార్ లో వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత కీమాను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో ఉప్పు, ప‌సుపు, పెరుగు, కారం వేసి క‌ల‌పాలి. దీనిపై మూత‌ను ఉంచి అర‌గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత కుక్క‌ర్ లో నూనె, బ‌ట‌ర్ వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌ల‌ను వేసి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి క‌ల‌పాలి. ఈ ట‌మాట ముక్క‌ల‌ను మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. ట‌మాట ముక్క‌లు వేగిన త‌రువాత ప‌సుపు, అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి.

త‌రువాత మ‌ట‌న్ కీమాను వేసి క‌ల‌పాలి. దీనిని 10 నిమిషాల పాటు వేయించిన త‌రువాత జీల‌క‌ర్ర పొడి, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. త‌రువాత ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న పొడి వేసి క‌లపాలి. ఈ కీమాను మ‌రో 5 నిమిషాల పాటు వేయించిన త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసుకోవాలి. త‌రువాత దీనిపై మూత‌ను ఉంచి మ‌ధ్య‌స్థ మంట‌పై 5 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత మూత తీసి కొత్తిమీర‌ను వేసి మ‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మ‌ట‌న్ కీమా త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ, పుల్కా వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.

Share
D

Recent Posts