Paneer Tikka Masala : ప‌నీర్‌తో ఒక్క‌సారి ఈ కూర‌ను చేయండి.. చ‌పాతీల్లోకి టేస్ట్ అదిరిపోతుంది..!

Paneer Tikka Masala : మ‌నం పనీర్ తో ర‌క‌ర‌కాల రుచిక‌ర‌మైన వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ప‌నీర్ తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే ప‌నీర్ కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీస‌సుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు ల‌భిస్తాయి. ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. శ‌రీరం ధృడంగా త‌యార‌వుతుంది. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. పనీర్ తో చేసే వంట‌కాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఈ ప్ర‌యోజ‌నాల‌న్నింటిని పొంద‌వ‌చ్చు. ప‌నీర్ తో చేసే రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ప‌నీర్ టిక్కా మ‌సాలా కూడా ఒక‌టి.

ఇది మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ఎక్కువ‌గా ల‌భిస్తుంది. ఈ ప‌నీర్ టిక్కా మ‌సాలాను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ప‌నీర్ టిక్కా మ‌సాలా కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి..త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Paneer Tikka Masala recipe in telugu very tasty with chapati
Paneer Tikka Masala

ప‌నీర్ టిక్కా మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌నీర్ – 200 గ్రా., చిన్న‌గా త‌రిగిన ట‌మాట – 1, త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు – ఒక క‌ప్పు, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, త‌రిగిన క్యాప్సికం ముక్క‌లు – ఒక క‌ప్పు, పెరుగు – అర క‌ప్పు, కొత్తిమీర – కొద్దిగా, కొబ్బ‌రి పాలు – ఒక క‌ప్పు, ఉప్పు- త‌గినంత‌, కారం – ఒక టీస్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, నెయ్యి – 2 టీ స్పూన్స్, సాజీరా -ఒక టీ స్పూన్.

ప‌నీర్ టిక్కా మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో పెరుగును తీసుకోవాలి. తరువాత ఇందులో కొద్దిగా ఉప్పు, కారం, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. త‌రువాత ఇందులో పనీర్ ముక్క‌లు వేసి క‌ల‌పాలి. వీటిని 20 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడ‌య్యాక మ్యారినేట్ చేసుకున్న ప‌నీర్ ను వేసి వేయించాలి. దీనిని 5 నిమిషాల పాటు వేయించిన తరువాత ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత సాజీరా వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్కలు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు ఎర్ర‌గా అయ్యిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న‌పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత క్యాప్సికం ముక్క‌లు వేసి మెత్త‌బ‌డే వ‌ర‌కు వేయించాలి.

తరువాత ట‌మాట ముక్క‌లు వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ఉప్పు, కారం, ధ‌నియాల పొడి, ప‌సుపు వేసి క‌ల‌పాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత కొబ్బ‌రి పాలు పోసి క‌ల‌పాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి క‌ల‌పాలి. దీనిని కొద్దిగా ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు ఉడికించిన త‌రువాత వేయించిన ప‌నీర్ వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి మ‌రో 5 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత గ‌రం మ‌సాలా, కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ప‌నీర్ టిక్కా మ‌సాలా క‌ర్రీ త‌యార‌వుతుంది . దీనిని అన్న‌, రోటీ, చ‌పాతీ, నాన్ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది.

Share
D

Recent Posts