Peethala Curry : పీత‌ల క‌ర్రీ ఎప్పుడైనా ఇలా చేశారా.. ఒక్క‌సారి రుచి చూడండి.. సూప‌ర్‌గా ఉంటుంది..!

Peethala Curry : మ‌నం పీత‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. పీత‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవ‌డం వల్ల మ‌నం వివిధ ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. పీత‌ల‌తో ఎక్కువ‌గా క‌ర్రీని త‌యారు చేస్తూ ఉంటారు. పీత‌ల‌తో చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది పీత‌ల క‌ర్రీని ఇష్టంగా తింటారు. అలాగే దీనిని ఒక్కో విధంగా త‌యారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా త‌యారు చేసే పీత‌ల క‌ర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఈ విధంగా తయారు చేసిన పీత‌ల కర్రీ ఇంట్లో అంద‌రికి న‌చ్చుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. రుచిగా, క‌మ్మ‌గా పీత‌ల కర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

పీత‌ల క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

శుభ్రం చేసిన పీత‌లు – 800 గ్రా., నాన‌బెట్టిన చింత‌పండు – పెద్ద నిమ్మ‌కాయంత‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 15 నుండి 20, అల్లం – ఒక ఇంచు ముక్క‌, త‌రిగిన ఉల్లిపాయలు – 2 ( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), ల‌వంగాలు – 3, యాల‌కులు – 2, నూనె – 6 టేబుల్ స్పూన్స్, మెంతులు – పావు టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – 3 నుండి 4 టీ స్పూన్స్, ధ‌నియాల పొడి – 2 టీ స్పూన్స్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, వేయించిన జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్.

Peethala Curry recipe in telugu very easy to cook
Peethala Curry

పీత‌ల క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా జార్ లో వెల్లుల్లి రెబ్బ‌లు, అల్లం, ఉల్లిపాయ ముక్క‌లు, ల‌వంగాలు, యాల‌కులు వేసి మెత్త‌గా మిక్సీ పట్టుకోవాలి. త‌రువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మెంతులు, జీల‌క‌ర్ర‌, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌ల‌పాలి. దీనిని ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించిన త‌రువాత ఉప్పు, కారం, ప‌సుపు, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. మ‌సాలాల‌ను వేయించిన త‌రువాత పీత‌లు వేసి క‌ల‌పాలి. వీటిని 3 నిమిషాల పాటు వేయించిన త‌రువాత చింత‌పండు ర‌సం, నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి 7 నుండి 8 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత మ‌రో అర గ్లాస్ నీళ్లు పోసి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ మ‌రో 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించాలి. పీతలు చ‌క్క‌గా ఉడికిన త‌రువాత కొత్తిమీర‌, జీల‌క‌ర్ర పొడి, మ‌రో అర టీ స్పూన్ ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో నిమిషం పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పీత‌ల క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన పీత‌ల క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts