Tomato Sambar : ట‌మాటాల‌తో సాంబార్‌ను ఇలా చేయండి.. అన్నంలో క‌లిపి తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Tomato Sambar : మ‌నం వంటింట్లో త‌ర‌చూ సాంబార్ ను త‌యారు చేస్తూ ఉంటాం. సాంబార్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది సాంబార్ ను ఇష్టంగా తింటారు. ఈ సాంబార్ ను అన్నంతో పాటు అల్పాహారాల‌తో కూడా తింటూ ఉంటాం. ఈ సాంబార్ ను మ‌నం ట‌మాటాలు అలాగే మ‌సాలా పొడి వేసి మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ట‌మాటాలు వేసి చేసే ఈ సాంబార్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ లొట్ట‌లేసుకుంటూ తింటారు. ట‌మాటాలు వేసి రుచిగా సాంబార్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ట‌మాట సాంబార్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన కందిప‌ప్పు – 100 గ్రా., ట‌మాటాలు – 3, త‌రిగిన టమాటాలు – 3, త‌రిగిన పెద్ద ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 6, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, శ‌న‌గ‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, మెంతులు – 10, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, నాన‌బెట్టిన చింత‌పండు – చిన్న నిమ్మ‌కాయంత‌, ప‌సుపు – అర టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 5.

Tomato Sambar recipe in telugu tasty with rice how to make it
Tomato Sambar

ట‌మాట సాంబార్ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో ట‌మాటాల‌ను వేసి మెత్త‌గా ఉడికించాలి. ట‌మాటాలు ఉడికిన త‌రువాత వాటిపై ఉండే పొట్టును తీసి ట‌మాటాల‌ను జార్ లో వేసుకోవాలి. త‌రువాత వీటిని మెత్త‌గా పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో ఒక టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ధ‌నియాలు, ఎండుమిర్చి, జీల‌క‌ర్ర‌, శ‌న‌గ‌ప‌ప్పు, మెంతులు వేసి వేయించాలి. త‌రువాత వెల్లుల్లి రెబ్బ‌లు, క‌రివేపాకు వేసి వేయించాలి. ఇవి చ‌క్క‌గా వేగిన త‌రువాత వాటిని జార్ లో వేసుకుని మెత్త‌ని పొడిలా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి, ఇంగువ‌, క‌రివేపాకు వేసి వేయించాలి. తాళింపు వేగిన త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న ట‌మాటాలు, ట‌మాట ముక్క‌లు, ఉప్పు, ప‌సుపు వేసి క‌ల‌పాలి.

త‌రువాత‌ ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయిన త‌రువాత ఉడికించిన కందిప‌ప్పు, చింత‌పండు ర‌సం, 2 గ్లాసులు నీళ్లు, మిక్సీ ప‌ట్టుకున్న మ‌సాలా పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత ఈ సాంబార్ ను 15 నిమిషాల పాటు మ‌రిగించాలి. త‌రువాత కొత్తిమీర‌, ఒక టీ స్పూన్ బెల్లం తురుము వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో రెండు నిమిషాల పాటు మ‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట సాంబార్ త‌యారవుతుంది. దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ చేసే సాంబార్ కంటే ఈ విధంగా ట‌మాటాలు వేసి చేసే సాంబార్ మ‌రింత రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts