గడచిన 75 సంవత్సరాలలో రైల్వే నెట్వర్క్ లో, ట్రైన్ ల సంఖ్యలో, ప్రయాణికుల, సరకు రవాణా లలో, సేఫ్టీ, రక్షణ లో, సగటు ప్రయానికునికి అతి తక్కువ ధరకు ప్రయాణం చేసే అవకాశం కల్పించటం లో, uni guage నిర్మించడంలో చాలా వరకు సక్సెస్ ఐనది. వొకే వొక వేగం విషయం లో తగిన అభివృద్ది జరగ లేదన్నది నిజం. ఇప్పుడు ఆ దిశగా కొంత పని జరుతున్నది. ఆహ్వానించ వలసిన విషయం.
ఇతర అభివృద్ది చెందిన దేశాలలో 180 km మామూలు వేగం. కొన్ని సెక్షన్లు లో 280 km speed తో నడుస్తున్నాయి. కొద్ది ప్రాంతాలలో 400 km ట్రైన్స్ ఉన్నా అతి స్వల్పం. కానీ టికెట్ ధర మన ఏసీ 3 టైర్ తో పోలిస్తే 10 రెట్ల పైమాటే. మన GDP 2000$ మాత్రమే. మన సామాన్య మానవుడు ఆర్ధికం గా ఎదిగిన తరువాతే ఆ ఫెసిలిటీ అందుకొగలుగు తాము మరియు రైల్వే కూడా ఆ లెవెల్ కు అభి వృద్ది చెందుతుంది.
ప్రస్తుతానికైతే వందే భారత్ టికెట్ గురించి ఆలోచించ కుండా స్తోమత వున్నవాళ్ళు ఆస్వాదించాలి స్వాగతించాలి. రైల్వే శాఖను ప్రోత్సహించాలి, ఇంకా డెవలప్ చెయ్యటానికి ఇది ఇన్స్పిరేషన్ అవుతుంది. వందే భారత్ వేగం లో పెద్ద మార్పు లేక పోయినా, సరాసరి ప్రయాణ సమయం తక్కువ వుండటం మంచి విషయం.