ఆధ్యాత్మికం

పూజ సమయంలో రాగి పాత్రలను వాడుతారు.. దీని వెనుక ఉన్న కారణం ఏమిటంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">హిందువులు పూజా సమయాలలో ఎక్కువభాగం రాగితో తయారుచేసిన పూజాసామాగ్రిని ఉపయోగించడం మనం చూస్తుంటాం&period; పూజ సమయంలో ఈ విధంగా రాగి పాత్రలను వాడటం వెనుక ఉన్న అర్థం&comma; పరమార్థాన్ని వరాహపురాణంలో వరాహస్వామి భూదేవికి వివరించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వరాహ పురాణం ప్రకారం&period;&period; కొన్ని యుగాల క్రితం గుడాకేశుడు అనే రాక్షసుడు విష్ణువు గురించి ఎంతో భక్తితో తపస్సు చేశాడు&period; ఆ రాక్షసుడి తపస్సుకు మెచ్చిన విష్ణువు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోవాలని అడగగా అందుకు గుడాకేశుడు తన దేహాన్ని సుదర్శన చక్రంతో ఖండించి భగవంతుడిలో ఐక్యం చేసుకోవాలని కోరాడు&period; అదే విధంగా తన శరీరంతో తయారు చేసిన సామాగ్రిని పూజా సమయంలో ఉపయోగించాలని కోరాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57599 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;copper-vessels&period;jpg" alt&equals;"why copper vessels are used in pooja " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇందుకు విష్ణువు వైశాఖ శుక్లపక్ష ద్వాదశి రోజు నీ కోరిక తీరుతుందని చెప్పాడు&period; కొద్దిరోజుల తర్వాత వైశాఖ శుక్ల పక్ష ద్వాదశి రావడంతో గుడాకేశుడి తల సుదర్శన చక్రంతో ఖండించబడుతుంది&period; ఈ క్రమంలోనే తన ఆత్మ వైకుంఠం చేరగా తన శరీరం రాగిగా రూపొందింది&period; ఈ రాగి పాత్రలను తనకు పూజా సమయంలో ఉపయోగించాలని విష్ణుదేవుడు తన భక్తులను ఆదేశించాడు&period; అప్పటినుంచి పూజా సమయంలో రాగి వస్తువులను వాడటం ఆచారంగా వస్తోందని వరాహ స్వామి భూదేవికి వివరించాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts