చాలా మంది తామ పూజించే ఇష్టదైవానికి అనుగుణంగా నుదుటన బొట్టు లేదా సింధూరం పెట్టుకుంటారన్న విషయం తెలిసిందే. అయితే చాలా మంది ధరించేది కుంకుమ. ఇది ఎంతో పవిత్రమైంది. కుంకుమను ధరించిన తరువాతనే పూజలు చేయడం, ఆలయాలను సందర్శించడం చేస్తారు. ఇక కొందరు కుంకుమను నిత్యం ధరిస్తారు. అయితే నుదుటన కుంకుమను ఎందుకు ధరిస్తారు.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మన కనుబొమ్మల మధ్య ఆజ్ఞాచక్రం ఉంటుంది. అది వేడి పుట్టిస్తూ ఉంటుంది. అందుకే అక్కడ చల్లదనం అవసరం. పసుపు, కుంకుమ, తిలకం, భస్మం, చందనం, శ్రీచూర్ణం వగైరాలు ఈ అవసరాన్ని తీరుస్తాయి. ముఖం మీద బొట్టు గుండ్రంగా పెట్టుకోవాలా?అడ్డంగా పెట్టుకోవాలా?నిలువుగా పెట్టుకోవాలా? అని అడిగితే ఎవరికిష్టం వచ్చినట్టు వారు, వారివారి వంశాచారం ప్రకారం పెట్టుకోవచ్చు.
ఏ బొట్టయినా ముఖానికి అందాన్ని, తేజస్సును ఇస్తుంది. మొత్తం మీద అడ్డంగా పెట్టుకునే భస్మం ఆయుర్వుద్ధిని ఐశ్వరాభివృద్ధిని కలిగిస్తుంది. నిలువుగా పెట్టుకునే శ్రీచూర్ణం బ్రహ్మరంధ్రము ద్వారా జీవాత్మ చేరుకునే పరమపదాన్ని సూచిస్తుంది. కనుబొమ్మల మధ్య బొట్టు నాడీ మండలంపై అనుకూల ప్రభావం చూపుతుంది.