Pippallu : అనేక వ్యాధుల‌పై బ్ర‌హ్మాస్త్రంలా ప‌నిచేసే పిప్ప‌ళ్లు..!

Pippallu : ఆయుర్వేదంలో అనేక ర‌కాల ఔష‌ధాల త‌యారీలో ఉప‌యోగించే ప‌దార్థాల్లో పిప్ప‌ళ్లు ఒక‌టి. పిప్ప‌ళ్ల గురించి చాలా మందికి తెలియ‌దు. ఇవి మిరియాల‌లాగానే ఘాటుగా ఉంటాయి. వీటితో అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. పిప్ప‌ళ్లు అనేక వ్యాధుల‌కు ప‌నిచేస్తాయి. వీటిని ఉప‌యోగించి ఏయే వ్యాధుల‌ను ఎలా త‌గ్గించుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

home remedies using long pepper

* ద‌గ్గు, ఆస్త‌మా, జ‌లుబు వంటి శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల‌కు పిప్ప‌ళ్లు బాగా ప‌నిచేస్తాయి. పిప్ప‌ళ్ల పొడి 1 గ్రాము, పాత బెల్లం పొడి 5 గ్రాములు తీసుకుని క‌లిపి చిన్న చిన్న ఉండ‌ల్లా చేయాలి. వాటిని పూట‌కు ఒక‌టి చొప్పున మింగుతుండాలి. దీంతో ద‌గ్గు, ఆస్త‌మా త‌గ్గిపోతాయి. వాటిపై పిప్ప‌ళ్లు బ్ర‌హ్మాస్త్రంలా ప‌నిచేస్తాయి. అందుక‌నే ఆయా వ్యాధులు త‌గ్గుతాయి.

* చాలా మందికి అసిడిటీ, ఛాతిలో మంట‌, పుల్ల‌ని త్రేన్పులు.. వంటి స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. వీటిని కూడా పిప్ప‌ళ్ల‌తో త‌గ్గించుకోవ‌చ్చు. 1 గ్రాము పిప్ప‌ళ్ల పొడికి అర టీస్పూన్ తేనె క‌లిపి రోజూ ఉద‌యం, సాయంత్రం రెండు పూట‌లా భోజ‌నం చేసిన త‌రువాత తీసుకుంటుండాలి. దీంతో ఆయా స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు.

* అర గ్రాము పిప్ప‌ళ్ల పొడిని ఒక గ్లాస్ నీటిలో క‌లిపి తాగాలి. రోజుకు ఇలా రెండు సార్లు చేస్తే వాంతులు, వికారం, త‌ల‌తిర‌గ‌డం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

* మ‌ట్టి పాత్ర‌లో పిప్ప‌ళ్ల‌ను వేయించి పొడి చేయాలి. దాన్ని 3 గ్రాముల మోతాదులో తీసుకుని ఒక టీస్పూన్ తేనె క‌లిపి చ‌ప్ప‌రించి మింగుతుండాలి. రోజుకు ఇలా 2 సార్లు చేయాలి. క‌డుపు ఉబ్బ‌రం త‌గ్గుతుంది. ఆక‌లి బాగా అవుతుంది.

* పిప్ప‌ళ్లు, శొంఠి, మిరియాలను స‌మాన భాగాల్లో తీసుకుని పొడి చేయాలి. ఆ మిశ్ర‌మాన్ని ఒక గ్రాము మోతాదులో తీసుకుని దానికి ఒక టీస్పూన్ తేనె క‌లిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. దీర్ఘ‌కాలికంగా ఉండే జ‌లుబు, గొంతు బొంగురు స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఇక అదే మిశ్ర‌మంతో క‌షాయం కాచి దాన్ని 30 ఎంఎల్ మోతాదులో తీసుకుని అందులో ఒక టీస్పూన్ తేనె క‌లిపి కూడా తాగ‌వ‌చ్చు. దీంతో కూడా ఆయా స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

* పిప్ప‌ళ్లు, వ‌స పొడిల‌ను స‌మాన భాగాల్లో తీసుకుని క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని 3 గ్రాముల మోతాదులో గోరు వెచ్చ‌ని నీరు లేదా పాల‌తో క‌లిపి రోజుకు 2 సార్లు తీసుకోవాలి. దీంతో మైగ్రేన్ త‌ల‌నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.

* పిప్ప‌ళ్ల పొడిని 2 గ్రాముల మోతాదులో తీసుకుని ఒక టీస్పూన్ తేనెకు క‌లిపి రోజూ ఉద‌యం, సాయంత్రం తీసుకోవాలి. దీంతో అధిక బ‌రువు సుల‌భంగా త‌గ్గుతారు. ఈ మిశ్ర‌మాన్ని తీసుకున్న త‌రువాత 1 గంట పాటు ఏవీ తీసుకోకూడ‌దు.

* ఒక గ్లాస్ మ‌జ్జిగలో 2 గ్రాముల పిప్ప‌ళ్ల పొడిని క‌లిపి రోజూ ఉద‌యం, సాయంత్రం తీసుకోవాలి. దీని వ‌ల్ల ప్ర‌సవానంత‌రం పొట్ట ఎత్తుగా ఉండే మ‌హిళ‌ల‌కు పొట్ట త‌గ్గి స‌మ‌త‌లంగా అవుతుంది.

Share
Admin

Recent Posts