శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలు ఎక్కువగా పెరిగిపోతే గౌట్ అనే సమస్య వస్తుంది. దీంతో కీళ్లలో రాళ్ల లాంటి స్ఫటికాలు ఏర్పడుతాయి. ఈ క్రమంలో తీవ్రమైన నొప్పులు వస్తాయి. కీళ్ల వద్ద వాపులు, నొప్పి, ఎరుపు దనం ఉంటాయి. అయితే కింద సూచించిన విధంగా ఆయుర్వేద మూలికలను వాడితే దాంతో శరీరంలో పెరిగిన యూరిక్ యాసిడ్ లెవల్స్ తగ్గుతాయి. ఈ క్రమంలో గౌట్ రాకుండా ఉంటుంది. ఈ సమస్య ఉన్నవారు కూడా ఈ మూలికలను వాడవచ్చు. దీంతో ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. మరి ఆ మూలికలు ఏమిటంటే..
1. పునర్నవ: ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇది కీళ్లలో వాపులను తగ్గిస్తుంది. యూరిక్ యాసిడ్ను బయటకు పంపుతుంది. దీంతో వాపులు, నొప్పులు తగ్గుతాయి. పునర్నవ ట్యాబ్లెట్లు, పొడి రూపంలో లభిస్తుంది. ఆయుర్వేద మందుల షాపుల్లో లభ్యమవుతుంది. ప్యాక్పై సూచించిన విధంగా లేదా డాక్టర్ సూచన మేరకు వాడుకోవాల్సి ఉంటుంది.
2. గుగ్గులు: మార్కెట్లో గుగ్గులుకు చెందిన ట్యాబ్లెట్లు లభిస్తాయి. వీటిని వాడవచ్చు. ఇవి పెయిన్ కిల్లర్లా పనిచేస్తాయి. దీంతో నొప్పి, వాపులు తగ్గుతాయి.
3. తిప్పతీగ: యూరిక్ యాసిడ్పై ఇది బాగా పనిచేస్తుంది. శరీరంలో పిత్త దోషాన్ని తగ్గిస్తుంది. యూరిక్ యాసిడ్ లెవల్స్ ను తగ్గిస్తుంది. దీని రసాన్ని రోజూ ఉదయం 30 ఎంఎల్ మోతాదులో తీసుకోవచ్చు.
4. తుంగ ముస్తలు: గౌట్ సమస్యను తగ్గించడంలో ఇవి బాగా పనిచేస్తాయి. వీటి పొడిని రాత్రి నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే మరిగించి అనంతరం వడకట్టి తాగేయాలి. సమస్య తగ్గుతుంది.
5. నల్ల కిస్మిస్లను రోజూ నీటిలో నానబెట్టి 10-15 చొప్పున ఉదయాన్నే తింటుండాలి. రాత్రి నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తినాలి. యూరిక్ యాసిడ్ లెవల్స్ తగ్గుతాయి.
6. వరుణ చూర్ణాన్ని రాత్రి నొప్పి ఉన్న చోట రాయాలి. నీటితో కలిపి పేస్ట్లా చేసి రాయాల్సి ఉంటుంది. నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
7. శొంఠి, పసుపులను నీటితో కలిపి పేస్ట్లా చేసి ఆ మిశ్రమాన్ని కీళ్లపై రాస్తే నొప్పులు, వాపులు తగ్గుతాయి.
ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం టెలిగ్రామ్లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365