చిట్కాలు

నంది వ‌ర్ధ‌నం పువ్వ‌ల‌ను క‌ళ్ల‌పై పెట్టుకుంటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

ధనియాలను నీళ్ళలో నానవేసి ఆ నీటిని తరచుగా తాగుతుంటే వాంతులు తగ్గుతాయి. నందివర్ధనం పూలను కాని రేకులను కాని కళ్ల మీద పెట్టుకుంటే అలసిన కళ్లకు సాంత్వన కలుగుతుంది. ఎక్కువ సమయం కంప్యూటర్‌తో పనిచేసే వాళ్లకూ, ఎండకు వెళ్లే వాళ్లకూ ఇది చక్కటి చికిత్స. ఈ కాలంలో ఎండ సమయంలో బయటకు వెళ్లే వాళ్లు తరచుగా ఎదుర్కొనే సమస్య కళ్లు స్టకీగా మారటం, అంటే కళ్లు మూసుకుని తెరిచినప్పుడు రెప్పలు తేలిగ్గా విచ్చుకోకుండా, ఏదో అడ్డుపడుతున్నట్లు, అతుక్కున్నట్లు ఉంటుంది. అలాంటప్పుడు కూడా నందివర్ధనం పూలు బాగా పని చేస్తాయి. నాలుగైదు బాదం పప్పులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే మెదడు వికాసం పొందుతుంది. నిద్రలేమితో బాధపడేవారికి తులసి గొప్ప ఔషధం. అడవి తులసి రసాన్ని పంచదారతో కలిపి ప్రతిరోజూ రాత్రి పడుకోబోయే ముందు రెండు చెంచాలు తాగితే చక్కగా నిద్రపడుతుంది.

నిద్రలేమితో బాధపడుతుంటే ఒక గ్లాసు వేడిపాలలో మూడు టీస్పూన్ల తేనె కలిపి తాగాలి. నిద్రలేమితో బాధపడుతుంటే పడుకోబోయే ముందు పదిహేను నిమిషాలసేపు పాదాలను, అరిపాదాలను నెయ్యి లేదా ఆముదంతో మర్ధన చేయాలి. నిద్రలేమి శరీరంలో హార్మోన్ల మీద ప్రభావం చూపుతుంది. హార్మోన్ల స్ధాయుల్లో హెచ్చుతగ్గులతో పాటు మెటబాలిజమ్‌ వేగం తగ్గుతుంది. మంచి నిద్ర కణాల పుననిర్మాణాన్ని, బాడీ మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. కాబట్టి రోజుకు ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి. నిమ్మరసంలో జీలకర్ర నానేసి వరుసగా ఏడు రోజులపాటు, రోజూ ఉదయం కొంచెం తింటుంటే పైత్యం తగ్గుతుంది. నీటిలో మెంతులు వేసి చేసిన టీ తాగితే కడుపులో మంట తగ్గుతుంది. నీళ్ళలో తులసి ఆకులు వేసి రాత్రంతా అలా ఉంచి ఉదయాన్నే పరగడుపున తాగితే జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలు సమసిపోతాయి.

nandivardhana flower put this on your eyes

నువ్వుల నూనె లేదా ఆముదంలో వెల్లుల్లి రేకలు వేసి ఐదు నిమిషాల సేపు సన్నని మంటమీద మరిగించాలి. ఈ నూనెతో వెన్నుకు మర్దనా చేయాలి. వీటికి బదులుగా ఏదైనా వంటనూనెను కూడా వాడవచ్చు. నులిపురుగుల సమస్య నుంచి విముక్తి పొందాలంటే టీస్పూను వాము, టీ స్పూను ఆముదం కలిపి రోజుకి రెండుసార్లు తీసుకోవాలి. నోటిపూత బాధిస్తుంటే మాచికాయను నూరి నీటిలో కలిపి ఆ మిశ్రమంతో పుక్కిలించాలి. ఇలా రోజుకు మూడుసార్లు చేస్తుంటే రెండు రోజులకు పూత పూర్తిగా తగ్గుతుంది. నోటికి సంబందించిన అనేక సమస్యలకు వేప మంచి ఔషదం. ఒక గ్లాసు నీటిలో టీస్పును వేపనూనె కలిపి ఆ నీటితో నోటిని బాగా పుక్కిలించినట్లయితే చిగుళ్ల నుండి రక్తం కారడం, మౌత్‌ అల్సర్‌, చిగుళ్ల నొప్పులు వంటివి పూర్తిగా నయమవుతాయి. రోజూ ఉదయాన్నే పది తాజా వేపాకులను నములుతుంటే నోటికి సంబందించిన సమస్యలు రావు.

Admin

Recent Posts