international

దావూద్ ఇబ్ర‌హీంను భార‌త ఇంటెలిజెన్స్ అధికారులు చంప‌కుండా ఆపిన అదృశ్య శ‌క్తి ఎవ‌రు..?

దావుద్ ఇబ్రహీంని చంపడానికి భారత గూఢచర్య సంస్థ రా (RAW).. చేపట్టిన సీక్రెట్ ఆపరేషన్ వివరాలు అతడికి చివరి నిమిషంలో తెలిపి, అతడిని కాపాడిన ఆ అదృశ్య శక్తి ఎవరు.? ముందుగా మ‌నం అజిత్ దోవ‌ల్ గురించి తెలుసుకుందాం. అజిత్ దోవల్. ఇతను 2005 జనవరిలో ఇంటెలిజెన్సు బ్యూరో డైరెక్టర్ గా రిటైర్ అయ్యారు. ఆపరేషన్ దావూద్ ని చంపడానికి పధకం నేసింది రా కాదు. ఇంటెలిజెన్సు బ్యూరో. అప్పటికే ఒక వార్త ఆయనకు తెలిసింది. జూలైలో దావూద్ ఇబ్రహీం కూతురైన మహరుఖ్ కు, క్రికెటర్ జావేద్ మియాందాద్ కొడుకు జునైద్ కు జూలై 9న మక్కాలో నిక్కా అంటే వివాహము, జూలై 13న దుబాయ్ గ్రాడ్ హయత్ హొటల్ లో రిసెప్షను జరుగుతుందని తెలిసింది.

అజిత్ దోవల్ దావూద్ ని తుదముట్టించడానికి ఇదే సరైన అవకాశమని భావించాడు. దావూద్ ఇబ్రహీంని ఐక్యరాజ్యసమితి ఇంటర్ నేషనల్ టెర్రరిస్టుగా గుర్తించడం వల్ల అతనికి పాకిస్థాన్ నుంచి బయటకు రావడం చాలా కష్టంగా మారింది. ఇంటిలిజెన్సు బ్యూరో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి నిర్ణయించుకుని దానిని అమలు చేసే బాధ్యతను అజిత్ దోవల్ కి అప్పగించింది. ఇది ఒక కోవర్ట్ ఆపరేషన్ అవడమూ, అందులో అది పరాయి దేశంలో అమలు కావలసి ఉండడంతో, భారత ప్రభుత్వము దీనిని అధికారికంగా చేపట్టలేదు.అందులో ప్రభుత్వ కమేండోలను ఉపయోగిచడం చాలా పెద్ద సాహసమవుతుంది. కాబట్టి ఇంటెలిజెన్సు బ్యూరో అధికార కమెండోలను కాక ఛోటా రాజన్ అనుచరులను దీనికి ఉపయోగించుకోడానికి నిర్ణయించింది.

who stopped indian officials from killing dawood ibrahim

1993 బొంబాయి పేలుళ్ల తర్వాత దావూద్, ఛోటా రాజన్ న మధ్య బాగా సంఘర్షణలు జరిగేయి. ఒకసారైతే, దావూద్, ఛోటారాజన్ ని చంపడానికి అతి చేరువ‌గా వచ్చేడు కూడానూ. ఛోటారాజన్ ఈ ప్రతిపాదనకు వెంటనే అంగీకరించి, తన ఇద్దరు అనుచరులు విక్కీ మల్హోత్రా, ఫరీద్ తనాషాను ఈ కార్యక్రమానికి నియమించాడు. అజిత్ దోవల్ వీళ్లిద్దరినీ ఒక రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి, శిక్షణ ప్రారంభించాడు. అలా మూడు వారాలపాటు శిక్షణ కొసాగింది.మూడు వారాలయ్యేసరికి వాళ్లిద్దరూ కార్యక్రమం పూర్తి చెయ్యడానికి పూర్తి సన్నద్ధతతో తయారయ్యారు. వాళ్లకి కొత్త పేర్లు ఇవ్వబడ్డాయి. సూడాన్ పాస్ పోర్టులు ఇవ్వబడ్డాయి. ప్లేన్ లో బిజినెస్ క్లాసులో ప్రయాణానికి సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి. ఇంకా వాళ్లు బయలుదేరడానికి ఐదు రోజులు ఉందనగా, బొంబాయి పోలీసులకు సమాచారం అందింది.

బొంబాయి డిప్యూటి పోలీస్ కమీషనర్ ధనంజయ్ కమలాకర్ తన టీముతో బొంబాయి బయలుదేరేడు. అజిత్ దోవల్ ఛోటారాజన్ అనుచరులిద్దరికి ఢిల్లీ లోని ఒక ఫైవ్ స్టార్ హొటల్ లోదుబాయిలోని గ్రాడ్ హయత్ హొటల్ బ్లూప్రింట్ చూపిస్తూ, ఆఖరి సూచనలు చేస్తుండగా ధనంజయ్ కమలాకర్ తన టీముతో వచ్చి ఆ ఇద్దరిని అరెస్టు చేస్తున్నట్టుగా ప్రకటించాడు. అతని దగ్గర అరెస్టు వారెంటు కూడా ఉంది. అజిత్ దోవల్ అతనికి ఎంత నచ్చచెప్పినప్పటికి వినలేదు. అది రహస్య ఆపరేషన్ అవడం వల్ల దోవల్ కూడా ఏమీ చేయలేకపోయేడు. ఒక బాధ్యత గల ఇంటిలిజెన్సు ఆఫీసర్ గా అతను అసలు ఆ ఆపరేషన్ ప్లాన్ చేయలేదని ప్రకటించి, వాళ్లిద్దరూ అరెస్టయే టైముకు తాను ఇంట్లోనే ఉండి టి.వి. చూస్తున్నట్టు ప్రకటించవలసి వచ్చింది.

అయితే బొంబయి పోలీసులు దావూద్ ని రక్షించడానికి అలా చేసేరా, లేదా రొటీన్ గా వారిపై కేసులు ఉన్నాయి కాబట్టి అలా చేసేరా అన్నది ఇప్పటికీ అర్ధం కాని ప్రశ్న. కానీ మన దేశాన్ని పీడిస్తున్న ఒక టెర్రరిస్టు నాయకున్ని వధించే ఒక అద్భుత మైన అవకాశం మాత్రం కొద్దిలో చేజారింది.

Admin

Recent Posts