వైద్య విజ్ఞానం

ఎలాంటి టెస్ట్ చేయ‌కుండానే గర్భం వ‌చ్చిందో, రాలేదో మ‌హిళ‌లు ఇలా సులభంగా తెలుసుకోవ‌చ్చు.

ప్రెగ్నెన్సీ వ‌చ్చిందో, రాలేదో తెలుసుకునేందుకు నేడు మ‌హిళ‌ల‌కు ఎన్నో ర‌కాల ప‌ద్ధ‌తులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్నిఇంట్లో చేసేవి అయితే కొన్ని ప‌రీక్ష‌లు హాస్పిట‌ల్స్ లో చేసి వారికి గ‌ర్భం వ‌చ్చిందో, రాలేదో చెబుతారు. అయితే ఎలాంటి ప‌రీక్ష చేయ‌కుండానే మ‌హిళ‌లు త‌మ‌కు గ‌ర్భం వ‌చ్చిందో, రాలేదో సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు. అందుకు వారి శ‌రీరంలో క‌నిపించే కొన్ని ల‌క్ష‌ణాలే కార‌ణం. ఈ క్ర‌మంలో ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే గ‌ర్భం వ‌చ్చింద‌ని చెప్ప‌వ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. గ‌ర్భం దాల్చారంటే మ‌హిళ‌ల్లో క‌నిపించే మార్పుల్లో ఇదొక‌టి. వారి వక్షోజాలు మృదువుగా, ఉబ్బిన‌ట్టు మారుతాయి. నిపుల్స్ చుట్టూ ఉన్న ప్ర‌దేశం వెడ‌ల్పుగా, న‌ల్ల‌గా మారుతుంది. ఇలా అవుతుందంటే ఆ మ‌హిళ‌ల‌కు ప్రెగ్నెన్సీ వ‌చ్చిన‌ట్టే లెక్క‌. బిడ్డ‌కు పాలివ్వ‌డం కోసం వ‌క్షోజాలు అలా మార్పు పొందుతాయి. అందుకే అలాంటి మార్పు కనిపిస్తుంది. దాన్ని బ‌ట్టే ప్రెగ్నెన్సీ వ‌చ్చింద‌ని చెప్ప‌వ‌చ్చు.

గ‌ర్భం దాల్చిన మ‌హిళ‌లు త‌ర‌చూ మూత్రానికి వెళ్లాల్సి వ‌స్తుంది. ఎందుకంటే పిండం ఏర్ప‌డుతుండ‌డం వ‌ల్ల గ‌ర్భాశ‌యం మూత్రాశ‌యంపై ఒత్తిడి క‌లిగిస్తుంది. అందుకే త‌ర‌చూ మూత్రం వస్తుంది. ఈ ల‌క్షణం క‌నిపించినా మ‌హిళ‌లు గ‌ర్భం దాల్చినట్టే లెక్క‌. అయితే షుగ‌ర్ స‌మ‌స్య ఉన్నా అలా త‌ర‌చూ మూత్రానికి వెళ్లాల్సి రావ‌చ్చు. అందుక‌ని ఇలాంటి ప‌రిస్థితి వ‌స్తే చెక‌ప్ చేయించుకోవ‌డం బెట‌ర్. మ‌హిళ‌లు గ‌ర్భం దాలిస్తే వెంట వెంట‌నే అల‌సిపోతుంటారు. ఎందుకంటే వారిలో ఉండే శ‌క్తి న‌శిస్తుంది. అందుకు కార‌ణం ఎదుగుతున్న పిండ‌మే. దానికి త‌గినట్టుగా ఆహారం తీసుకుంటే ఈ స‌మ‌స్య రాదు. ఈ ల‌క్ష‌ణం ఉందంటే గ‌ర్భం దాల్చిన‌ట్టే. గ‌ర్భాశ‌యంలో ఎదుగుతున్న పిండానికి నిత్యం 300 క్యాల‌రీల శ‌క్తి అవ‌స‌రం అవుతుంది. అందుకని గ‌ర్భం దాల్చిన మ‌హిళ‌ల‌కు బాగా ఆక‌లి వేస్తుంది. ఈ ల‌క్షణం క‌నిపించినా గ‌ర్బం దాల్చిన‌ట్టు అర్థం చేసుకోవాలి.

how to know women are pregnant or not

గర్భం దాల్చిన మ‌హిళ‌ల‌కు రుతుక్ర‌మం రాదు. కానీ రుతుక్ర‌మంలో వ‌చ్చినట్టుగా క‌డుపు నొప్పి వ‌స్తుంది. అందుకు కార‌ణం పిండం గ‌ర్భాశ‌య గోడ‌ల‌కు అతుక్కుంటూ ఉండ‌డ‌మే. అలా అవుతున్న ప‌క్షంలో క‌డుపు నొప్పి వ‌స్తుంది. ఈ ల‌క్ష‌ణం ఉంటే గ‌ర్బం వ‌చ్చిన‌ట్టే లెక్క‌. ప్రెగ్నెంట్ అయిన మ‌హిళ‌ల క‌డుపు నుంచి జ‌ననావ‌య‌వాల వ‌ర‌కు ఒక పొడ‌వాటి న‌ల్ల‌ని రేఖ ఏర్ప‌డుతుంది. గ‌ర్భం దాల్చిన మ‌హిళ‌ల‌కు నాలుక అంతా లోహ‌పూరిత‌మైన‌ట్టు అనిపిస్తుంది. అప్పుడు రుచి స‌రిగ్గా తెలియ‌దు. అయితే ఈ స్థితి కొన్ని రోజులే ఉంటుంద‌ట‌. సాధార‌ణంగా రెగ్యుల‌ర్‌గా వ‌చ్చే క‌ల‌లు కాకుండా గ‌ర్బం దాల్చిన వారికి పుట్ట‌బోయే బిడ్డ గురించే ఎక్కువ‌గా క‌ల‌లు వస్తాయ‌ట‌. అలా వస్తున్నా అలాంటి మ‌హిళలు గ‌ర్బం దాల్చిన‌ట్టు తెలుసుకోవాలి. గ‌ర్బం దాల్చిన మ‌హిళ‌ల‌కు ఉద‌యాన్నే వికారంగా ఉంటుంది. వాంతుల‌వుతాయి. ఒక్కోసారి ఫుడ్ పాయిజ‌న్ వ‌ల్ల కూడా అలా జ‌రిగేందుకు అవ‌కాశం ఉంటుంది. కనుక వైద్యున్ని సంప్ర‌దిస్తే ప్రెగ్నెంట్ అవునో కాదో తెలుస్తుంది.

Admin

Recent Posts