mythology

అభిమన్యుడు చిక్కుకున్న పద్మవ్యూహం….ఎలా ప్లాన్ చేశారో తెలుసా? ఇదిగో సమగ్రంగా మీకోసం.

పద్మవ్యూహం మహాభారత యుద్ధంలో ఉపయోగించిన యుద్ధ వ్యూహాలలో అతి క్లిష్టమైనది..దీని నిర్మాణం ఏడు వలయాలతో కూడి ఉండి శత్రువులు ప్రవేశించడానికి వీలు లేకుండా ఉంటుంది. కురుక్షేత్రయుద్ధంలో పాండవులను సంహరించడానికి ద్రోణాచార్యుడు తన అనుభవజ్ఞానాన్ని అంతా రంగరించి పద్మవ్యూహం పన్నగా అందులో అభిమన్యుడు చిక్కుకొని విరోచితంగా పోరాడి మరణిస్తాడు. అసలు పద్మవ్యూహం ఏంటి? అభిమన్యుడికి దానిలోకి వెళ్ళడం ఎలా తెలుసు? దాని లోనికి వెళ్లడానికి ఉన్న లాజిక్ ఏంటి? అనే విషయాలపై సమగ్రంగా చర్చించే ప్రయత్నం చేద్దాం.

పద్మవ్యూహ నిర్మాణం ఏడు వలయాలతో ఇలా నిర్మితమై, ఓ వైపు చిన్నగా తెరిచి ఉంటుంది. సాధారణంగా ఎవరైనా …తెరిచి ఉన్న భాగం నుండి లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అలా శత్రువులను సంహరించుకుంటూ వలయాల చుట్టూ తిరుగుతూ కేంద్రం వైపుగా వెళతారు. అలా వెళ్లడం కోసం….ఎదురుగా ఉన్న ప్రత్యర్థిని సంహరించి లోపలికి దూసుకెళ్లే ప్రతయ్నం చేస్తారు. ఇలా చేయడం వల్ల… చనిపోయిన ఆ సైనికుడి స్థానంలో పక్కనే ఉన్న మరో సైనికుడు వచ్చి చేరి…ఆ ప్రాంతం నుండి అభిమన్యు వెంట రక్షణగా వచ్చే వారిని లోపలికి వెళ్లకుండా అడ్డు నిలుస్తాడు. ఇలా చేయడం వల్ల…..అభిమన్యుడిని ఒక్కడిగా చేసి లోపలికి ఆహ్వానించి చంపాలనేది ద్రోణాచార్యుడి ప్లాన్.

do you know this about abhimanyu padmavyuhamతల్లిగర్భంలోనే పద్మవ్యూహంలోకి వెళ్లడం ఎలాగో నేర్చుకున్న అభిమన్యుడు….ద్రోణాచార్యుడు ఆలోచించి వల పనినట్టు కాక…..కొత్త‌పంథాను ఎన్నుకున్నాడు. దాని కోసం ఎదురుగా ఉన్న ప్రత్యర్థిని కాకుండా అతనికి కుడి ఎడమల వైపున్న ఇద్దర్ని చంపడం స్టార్ట్ చేశాడు…ఇలా చంపుకుంటూ లోపలకి వెళ్లిపోతున్నాడు…ఇలా చేయడం వల్ల ఎక్కువ గ్యాప్ క్రియేట్ అవుతుంది. దాని కారణంగా …అభిమన్యుడికి రక్షణగా వచ్చే ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు త్వరగా పద్మవ్యూహంలోపలికి అభిమన్యుడికి తోడుగా వచ్చే అవకాశం ఉంటుంది..తద్వారా కౌరవుల మీద విజయం సాధించవచ్చు అని ఇలా చేస్తాడు.

ఇలా పథకం ప్రకారం అభిమన్యుడైతే లోపలికి వెళ్లాడు …కానీ అతనికి రక్షణగా వస్తారనుకున్న ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు లోపలికి రాలేకపోయారు., దానికి కారణం…..పాండవులను ఏదైనా ఒక్కరోజు పాటు నిలువరించ వరం కలిగిన సైంధవుడు వీరిని యుద్ధరంగంలో అడ్డుకోవడం. ఇలా పద్మవ్యూహంలోకి ప్రవేశించిన అభిమన్యునికి పాండవుల సహాయం అందలేదు. అయినా వీరోచితంగా పోరాడి, లక్ష్మణ కుమారుణ్ణి చంపి, కౌరవుల వ్యూహానికి హతుడైపోతాడు.

అర్జునుడు ఒకసారి సుభద్రకు యుద్ధవిద్యలో పద్మవ్యూహం కష్టతరమైనది అంటూ పద్మవ్యూహంలో ఎలా ప్రవేశించాలో, చాకచక్యంగా ఎలా పోరాడాలో వివరించి చెప్పాడు. అప్పుడు సుభద్ర కడుపులో ఉన్న అభిమన్యుడు ఆ విద్యను అర్ధం చేసుకున్నాడు. అయితే, పద్మవ్యూహం నుండి ఎలా బయటపడాలో అర్జునుడు సుభద్రకి చెప్పలేదు. అలా చెప్పబోయేంతలో సుభద్ర నిద్రలోకి జారుకోవటం చూసి అర్జునుడు చెప్పటం ఆపివేశాడు. అభిమన్యుడు యుద్ధంలో చాకచక్యంగా పద్మవ్యూహం ఛేదించుకుంటూ లోనికి వెళ్ళి వీరోచితంగా పోరాడాడు కానీ ఆ వ్యూహం నుండి బయటపడలేక ప్రాణాలు కోల్పోయాడు.

Admin

Recent Posts