Aloo Butter Masala : ఆలు బ‌ట‌ర్ మ‌సాలా ఇలా చేయండి.. రెస్టారెంట్ స్టైల్‌లో వ‌స్తుంది..!

Aloo Butter Masala : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసే ఏ వంట‌కమైనా చాలా రుచిగా ఉంటుంది. బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో ఆలూ బ‌ట‌ర్ మ‌సాలా కూడా ఒక‌టి. బంగాళాదుంప‌ల‌తో చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఇది మ‌న‌కు ఎక్కువ‌గా రెస్టారెంట్ ల‌లో, ధాబాల‌లో ల‌భిస్తుంది. ఈ కూర‌ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఆలూ బ‌ట‌ర్ మ‌సాలాను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ బ‌ట‌ర్ మ‌సాలా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన బంగాళాదుంప‌లు – పావుకిలో, త‌రిగిన ట‌మాటాలు – 5, త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, బ‌ట‌ర్ – 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకులు – 2, యాల‌కులు – 4, దాల్చిన చెక్క – 2, జీడిప‌ప్పు – 2 టేబుల్ స్పూన్స్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – అర టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, క‌సూరి మెంతి – ఒక టీ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, నూనె – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Aloo Butter Masala make in restaurant style recipe is this
Aloo Butter Masala

ఆలూ బ‌ట‌ర్ మ‌సాలా త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో బ‌ట‌ర్ వేసి వేడి చేయాలి. బ‌ట‌ర్ క‌రిగిన త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. వీటిని ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించిన త‌రువాత ట‌మాట ముక్క‌లు, ప‌చ్చిమిర్చి, జీడిప‌ప్పు, మ‌సాలా దినుసులు వేసి క‌ల‌పాలి. త‌రువాత పావు గ్లాస్ నీళ్లు పోసి క‌ల‌పాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక బంగాళాదుంప ముక్క‌లు వేసి వేయించాలి. బంగాళాదుంప ముక్క‌లు ఎర్ర‌గా వేగిన త‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత ఇదే క‌ళాయిలో బ‌ట‌ర్ వేసి వేడి చేయాలి.

బట‌ర్ క‌రిగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ప‌చ్చిమిర్చి వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్, కారం, ఉప్పు, ప‌సుపు, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించిన త‌రువాత వేయించిన బంగాళాదుంప ముక్క‌లు, క‌సూరి మెంతి వేసి క‌ల‌పాలి. త‌రువాత ఒక గ్లాస్ నీళ్లు పోసి క‌ల‌పాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు మ‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ బ‌ట‌ర్ మ‌సాలా త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, నాన్ ఇలా దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని విడిచిపెట్ట‌కుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts