Aloo Dum Curry : ఆలు ద‌మ్ క‌ర్రీ త‌యారీ ఇలా.. ఎంతో టేస్టీగా ఉంటుంది..

Aloo Dum Curry : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌తో చేసిన కూర‌ల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. బంగాళాదుంప‌ల్లో చేసుకోద‌గిన వంట‌కాల్లో ఆలూ ధ‌మ్ క‌ర్రీ కూడా ఒక‌టి. రెస్టారెంట్ ల‌లో, హోటల్స్ లో ఈ కూర ఎక్కువ‌గా ల‌భిస్తుంది. చ‌పాతీ, నాన్, బ‌ట‌ర్ నాన్ వంటి వాటితో క‌లిపి తిన‌డానికి ఈ కూర చ‌క్క‌గా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌.బ్యాచిల‌ర్స్, వంట‌రాని వారు కూడా ఈ ఆలూ ధ‌మ్ కర్రీని చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఆలూ ధ‌మ్ క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ ధ‌మ్ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన చిన్న బంగాళాదుంప‌లు – పావు కిలో, త‌రిగిన ట‌మాట -1, త‌రిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, పెరుగు – 50 గ్రా., ధ‌నియాల పొడి – అర టేబుల్ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర – అర టేబుల్ స్పూన్, ల‌వంగాలు – 3, యాల‌కులు – 2, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, జీడిప‌ప్పు – 2 టేబుల్ స్పూన్స్, కారం – ఒక టేబుల్ స్పూన్, నూనె – 3 టేబుల్ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌. ప‌సుపు – పావు టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Aloo Dum Curry recipe in telugu very tasty easy to cook
Aloo Dum Curry

ఆలూ ధ‌మ్ క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక దాల్చిన చెక్క‌, యాల‌కులు, ల‌వంగాలు, జీడిప‌ప్పు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి పచ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి వేయించాలి. వీటిని మెత్త‌గా అయ్యే వర‌కు వేయించిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఉడికించిన బంగాళాదుంప‌ల‌కు ఫోర్క్ తో లేదా టూత్ పిక్ తో రంధ్రాలు పెట్టుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక కొద్దిగా ప‌సుపు, ఒక టీ స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ కారం వేసి క‌ల‌పాలి. త‌రువాత బంగాళాదుంప‌ల‌ను వేసి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి.

త‌రువాత అదే నూనెలో జీల‌క‌ర్ర‌, అల్లం పేస్ట్ వేసి వేయించాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌ల‌పాలి. త‌రువాత పెరుగు, కారం, ఉప్పు, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత వేయించిన బంగాళాదుంప‌ల‌ను వేసి క‌ల‌పాలి. త‌రువాత పావు గ్లాస్ నీళ్లు పోసి క‌లిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికిచుకోవాలి. చివ‌ర‌గా కొత్తిమీర‌ను చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ ధ‌మ్ క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ, పులావ్ వంటి వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. బంగాళాదుంప‌ల‌తో తర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా కూడ వండుకుని తిన‌వ‌చ్చు. ఈ ఆలూ ధ‌మ్ క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts