Aloo Egg Masala : రెస్టారెంట్ స్టైల్‌లో ఆలు ఎగ్ మ‌సాలా.. ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Aloo Egg Masala : మ‌నం బంగాళాదుంప‌ల‌తో వివిధ ర‌కాల వంట‌కాలను త‌యారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంప‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా సుల‌భంగా వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఆలూ ఎగ్ మ‌సాలా కూడా ఒక‌టి. బంగాళాదుంప‌లు, కోడిగుడ్లు క‌లిపి చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ ఇష్ట‌ప‌డ‌తార‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ క‌ర్రీని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. బ్యాచిల‌ర్స్, వంట‌రాని వారు కూడా ఈ క‌ర్రీని సుల‌భంగా త‌యారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ఆలూ ఎగ్ మ‌సాలా క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ ఎగ్ మ‌సాలా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 3 టేబుల్ స్పూన్స్, ఉడికించిన బంగాళాదుంపలు – 2 ( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), ఉడికించిన కోడిగుడ్లు – 4, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 3, బిర్యానీ ఆకు – 1, ప‌చ్చిమిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, ఎండుమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, త‌రిగిన ట‌మాటాలు – 2, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నీళ్లు – త‌గిన‌న్ని, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Aloo Egg Masala recipe make it like restaurant
Aloo Egg Masala

ఆలూ ఎగ్ మ‌సాలా త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత పావు టీ స్పూన్ మోతాదులో ఉప్పు, కారం, ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత ఇందులో బంగాళాదుంప‌ల‌ను ముక్క‌లుగా క‌ట్ చేసి వేసుకోవాలి. వీటిని ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత ఉడికించిన కోడిగుడ్ల‌ను వేసి వేయించాలి. వీటిని కూడా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించిప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత జీల‌క‌ర్ర‌, మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఎండుమిర్చి, ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్క‌లు, క‌రివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌బ‌డే వ‌ర‌కు వేయించాలి.

త‌రువాత ప‌సుపు, కారం, ఉప్పు, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి వేసి క‌ల‌పాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత రెండు లేదా మూడు బంగాళాదుంప ముక్క‌ల‌ను మెత్త‌గా చేసి వేసుకోవాలి. త‌రువాత మిగిలిన బంగాళాదుంప ముక్క‌ల‌ను, వేయించిన గుడ్ల‌ను వేసిక‌ల‌పాలి. వీటిపై మూత పెట్టి కూర ద‌గ్గ‌ర ప‌డి నూనె పైకి తేలే వ‌రకు ఉడికించాలి. కూర ఉడికిన త‌రువాత గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో నిమిషం పాటు ఉడికించి కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ ఎగ్ మ‌సాలా త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన ఆలూ ఎగ్ మ‌సాలా క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts