Dhaba Style Kaju Paneer Masala : ధాబా స్టైల్‌లో కాజు ప‌నీర్ మ‌సాలాను ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Dhaba Style Kaju Paneer Masala : మ‌న‌కు ధాబాల‌ల్లో ల‌భించే వాటిలో కాజు ప‌నీర్ మ‌సాలా క‌ర్రీ కూడా ఒక‌టి. ప‌నీర్, కాజు క‌లిపి చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. చ‌పాతీ, రోటీ, నాన్, జీరా రైస్ వంటి వాటిలోకి తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ క‌ర్రీని మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. వీకెండ్స్ లో, స్పెష‌ల్ డేస్ లో ఈ క‌ర్రీని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఎంతో క‌మ్మ‌గా ఉండే కాజు ప‌నీర్ మ‌సాలా క‌ర్రీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ధాబా స్టైల్ కాజు ప‌నీర్ మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉల్లిపాయ ముక్క‌లు – అర క‌ప్పు, త‌రిగిన ట‌మాటాలు- 3, జీడిప‌ప్పు – పావు క‌ప్పు, బ‌ట‌ర్ – 2 టేబుల్ స్పూన్స్, ప‌నీర్ – 150 గ్రా., ల‌వంగాలు – 3, యాల‌కులు – 2, బిర్యానీ ఆకు – 1, దాల్చిన చెక్క‌- ఒక చిన్న ముక్క‌, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, ధ‌నియాల పొడి – అర టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ – 2 టేబుల్ స్పూన్స్, క‌సూరిమెంతి – ఒక టీ స్పూన్.

Dhaba Style Kaju Paneer Masala recipe in telugu make in this way
Dhaba Style Kaju Paneer Masala

ధాబా స్టైల్ కాజు ప‌నీర్ మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా జార్ లో ఉల్లిపాయ ముక్క‌లు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత అదే జార్ లో ట‌మాటాలు, 8 జీడిప‌ప్పు ప‌లుకులు వేసి పేస్ట్ లాగా చేసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో ఒక టేబుల్ స్పూన్ బ‌ట‌ర్ వేసి వేడి చేయాలి. త‌రువాత ప‌నీర్ వేసి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత వీటిని గిన్నెలోకి తీసుకుని అదే క‌ళాయిలో జీడిప‌ప్పు వేసి వేయించాలి. జీడిప‌ప్పు ఎర్ర‌గా వేగిన త‌రువాత ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత అదే క‌ళాయిలో మ‌రికొద్దిగా బ‌ట‌ర్ వేసి వేడి చేయాలి. త‌రువాత మ‌సాలా దినుసులు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ట‌మాట పేస్ట్ వేసి నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించాలి.

త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. త‌రువాత ప‌సుపు, కారం, ఉప్పు, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి క‌ల‌పాలి. కూర ఉడికి కొద్దిగా నూనె పైకి తేలిన త‌రువాత ప‌నీర్ ముక్క‌లు, జీడిప‌ప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి 3 నుండి 4 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత క‌సూరిమెంతి వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కాజు ప‌నీర్ మ‌సాలా కర్రీ త‌యార‌వుతుంది. దీనిని దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts