Bhimla Nayak : భీమ్లా నాయ‌క్ ప్రీ రిలీజ్ వేడుక ఫిక్స్‌.. ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్‌..

Bhimla Nayak : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్, రానాలు ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన చిత్రం.. భీమ్లా నాయ‌క్‌. ఈ మూవీని ఈ నెల 25వ తేదీన పెద్ద ఎత్తున రిలీజ్ చేయ‌నున్నారు. అయితే ఏపీలో సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయిన‌ప్ప‌టికీ మూవీని రిలీజ్ చేయాల‌నే సిద్ధం అయ్యారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఈ నెల 21వ తేదీన ప్రీ రిలీజ్ వేడుక‌ను చాలా గ్రాండ్‌గా నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేశారు. ఈ క్ర‌మంలోనే ఓ ప్ర‌ముఖ వ్య‌క్తిని ఈ వేడుక‌కు గెస్ట్‌గా పిలిచారు.

minister KTR invited for Bhimla Nayak  pre release function
Bhimla Nayak

భీమ్లా నాయ‌క్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గాను తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిప‌ల్‌, పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజ‌రు కానున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ ఫంక్ష‌న్‌కు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే సాధార‌ణంగా ఓ మూవీ ప్రీ రిలీజ్ వేడుక‌కు సినిమా రంగానికి చెందిన వారినే ముఖ్య అతిథిగా పిలుస్తుంటారు. కానీ ఓ మంత్రిని ఇలా పిల‌వ‌డం చాలా అరుదుగా జ‌రుగుతుంటుంది. అయితే భీమ్లా నాయ‌క్ వేడుక‌కు కేటీఆర్‌ను ఆహ్వానించ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

కాగా మ‌ళ‌యాళంలో హిట్ అయిన అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్ చిత్రానికి రీమేక్‌గా భీమ్లా నాయ‌క్‌ను నిర్మించారు. ఇందులో ప‌వ‌న్ ప‌క్క‌న నిత్య మీన‌న్‌, రానా ప‌క్క‌న సంయుక్త మీన‌న్‌లు హీరోయిన్లుగా న‌టించారు. ఈ మూవీ అనంత‌రం ప‌వ‌న్ భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్‌, హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రాల షూటింగ్‌లో పాల్గొననున్నారు.

Share
Admin

Recent Posts