Paneer Pepper Masala : ధాబా స్టైల్‌లో అంద‌రికీ న‌చ్చేలా ప‌నీర్ పెప్ప‌ర్ మ‌సాలాను ఇలా చేయండి..!

Paneer Pepper Masala : మ‌న‌కు ధాబాల‌లో ల‌భించే ప‌నీర్ వెరైటీల‌లో ప‌నీర్ పెప్ప‌ర్ మ‌సాలా కూడా ఒక‌టి. ప‌నీర్ తో చేసే ఈ వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. చ‌పాతీ, నాన్, రోటీ వంటి వాటితో తిన‌డానికి ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర‌ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో, ఇంటికి అతిథులు వ‌చ్చిన‌ప్పుడు ఇలా ప‌నీర్ పెప్ప‌ర్ మ‌సాలా కూర‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని ఎవరైనా చాలా తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో క‌మ్మ‌గా, రుచిగా ఉండే ఈ పనీర్ పెప్ప‌ర్ మసాలాను ధాబా స్లైల్ లో ఎలా త‌యారు చేసుకోవాలి…త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ప‌నీర్ పెప్ప‌ర్ మ‌సాలా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌నీర్ క్యూబ్స్ – 200 గ్రా., నూనె – 4 టేబుల్ స్పూన్స్, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, నీళ్లు – ఒకటిన్న‌ర గ్లాస్, క‌సూరిమెంతి -ఒక టీ స్పూన్, మిరియాల పొడి – అర టీస్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, బ‌ట‌ర్ – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Paneer Pepper Masala recipe in telugu make in this method
Paneer Pepper Masala

మ‌సాలా పేస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

దాల్చిన చెక్క – ఒక చిన్న ముక్క‌, ల‌వంగాలు – 3, యాల‌కులు – 2, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, జీడిప‌ప్పు – 10, పెద్ద ముక్క‌లుగా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, త‌రిగిన ట‌మాటాలు – 2, కాశ్మీరి చిల్లీస్ – 6, నీళ్లు – ఒక గ్లాస్.

ప‌నీర్ పెప్ప‌ర్ మ‌సాలా త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో మ‌సాలా పేస్ట్ కు కావ‌ల్సిన ప‌దార్థాల‌ను క‌ళాయిలో వేసుకోవాలి. త‌రువాత నీళ్లు పోసి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఇవి మెత్త‌గా ఉడికిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లారనివ్వాలి. త‌రువాత వీటిని జార్ లో వేసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి.త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్ వేసి మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించాలి.

త‌రువాత ఉప్పు, కారం, ప‌సుపు, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి వేసి క‌ల‌పాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి మ‌రో 3 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత క‌సూరి మెంతి, మిరియాల పొడి, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. త‌రువాత ప‌నీర్ వేసి క‌ల‌పాలి. ఇప్పుడు మూత పెట్టి మ‌రో 4 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత బ‌ట‌ర్, కొత్తిమీర వేసుకుని క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ప‌నీర్ పెప్ప‌ర్ మ‌సాలా త‌యార‌వుతుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts