Veg Dum Biryani : వెజ్ ద‌మ్ బిర్యానీ.. ఇంట్లోనే ఇలా చేస్తే.. రెస్టారెంట్ లాగా రుచి వ‌స్తుంది..

Veg Dum Biryani : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే వివిధ ర‌కాల బిర్యానీల‌లో వెజ్ ద‌మ్ బిర్యానీ కూడా ఒక‌టి. కూర‌గాయ‌ల‌తో చేసే ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. అచ్చం రెస్టారెంట్ ల‌లో ల‌భించే విధంగా ఉండే ఈ బిర్యానీని మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వెజ్ ద‌మ్ బిర్యానీని చాలా సుల‌భంగా, రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వెజ్ ద‌మ్ బిర్యానీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టేబుల్ స్పూన్స్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క – 1, ల‌వంగాలు – 2, యాల‌కులు – 2, అనాస పువ్వు – 1, జాప‌త్రి – 1, మ‌రాఠి మొగ్గ – 1, బిర్యానీ ఆకు – 1, స‌న్న‌గా త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు – పావు క‌ప్పు, చిన్న‌గా త‌రిగిన ట‌మాట – 1.

మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన ప‌దార్థాలు..

కాలీఫ్ల‌వ‌ర్ ముక్క‌లు – అర క‌ప్పు, క్యారెట్ ముక్క‌లు – పావు క‌ప్పు, ఫ్రెంచ్ బీన్స్ – పావు క‌ప్పు, ప‌చ్చి బ‌ఠాణీ – పావు క‌ప్పు, బంగాళాదుంప ముక్క‌లు – పావు క‌ప్పు, క‌రివేపాకు – ఒక రెబ్బ‌, త‌రిగిన పుదీనా – కొద్దిగా, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, క‌సూరి మెంతి – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, జీడిప‌ప్పు మ‌రియు గ‌స‌గ‌సాల పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, పెరుగు – అర క‌ప్పు, నిమ్మ‌ర‌సం – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా పొడి – అర టీ స్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్, బ్రౌన్ ఆనియ‌న్స్ – పావు క‌ప్పు.

Veg Dum Biryani make in restaurant style at home
Veg Dum Biryani

అన్నం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నాన‌బెట్టిన బాస్మ‌తి బియ్యం – 300 గ్రా., నీళ్లు – రెండు లీట‌ర్లు, సాజీరా – ఒక టీ స్పూన్, బిర్యానీ ఆకు – 1, దాల్చిన చెక్క – 1, ల‌వంగాలు – 3, యాల‌కులు – 2, జాప‌త్రి – 1, నెయ్యి – ఒక టీ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌.

వెజ్ ద‌మ్ బిర్యానీ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో కూర‌గాయ ముక్క‌ల‌తోపాటు మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత వీటిపై మూత‌ను ఉంచి 20 నిమిషాల పాటు ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీటిని పోసి బాస్మ‌తి బియ్యం త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి నీటిని మ‌రిగించాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత నాన‌బెట్టిన బాస్మ‌తి బియ్యాన్ని వేసి క‌ల‌పాలి. ఈ బియ్యాన్ని మ‌ధ్య‌మ‌ధ్య‌లో క‌లుపుతూ 90 శాతం ఉడికించాలి. బియ్యం ఉడుకుతుండ‌గానే మ‌రో స్ట‌వ్ మీద క‌ళాయిని లేదా కుక్క‌ర్ నుఉంచాలి. ఇందులో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. ఇవి వేడ‌య్యాక మ‌సాలా దినుసులు వేసి వేయించాలి.

త‌రువాత ఉల్లిపాయ ముక్క‌ల‌ను వేసి రంగు మారే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌ల‌ను వేసి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత మ్యారినేట్ చేసుకున్న కూర‌గాయ ముక్క‌ల‌ను వేసి క‌ల‌పాలి. వీటి పై మూత‌ను ఉంచి 50 శాతం వ‌ర‌కు ఉడికించి మంట‌ను చిన్న‌గా చేయాలి. ఇప్పుడు అన్నం ఉడికిన త‌రువాత పూర్తిగా నీళ్లు లేకుండా చేసుకుని ఆ అన్నాన్ని ఉడికించిన కూర‌గాయ ముక్క‌ల‌పై వేసి అంతా స‌మానంగా చేసుకోవాలి. దీనిపై కొద్దిగా పుదీనాను, కొత్తిమీర‌ను, బ్రౌన్ ఆనియ‌న్స్‌ను చ‌ల్లాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని, ఫుడ్ క‌ల‌ర్ ను లేదా కుంకుమ పువ్వును నీటిలో క‌లిపి వేయాలి.

త‌రువాత దీనిపై మూత‌ను ఉంచి ఆవిరి బ‌య‌ట‌కు పోకుండా చూసుకోవాలి. ఈ బిర్యానీని 10 నిమిషాల పాటు చిన్న మంట‌పై, 5 నిమిషాల పాటు పెద్ద, మ‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేయాలి. దీనిని 10 నిమిషాల పాటు అలాగే క‌దిలించ‌కుండా ప‌క్క‌కు ఉంచాలి. 10 నిమిషాల త‌రువాత దీనిని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలాచేయ‌డం వ‌ల్ల అచ్చం రెస్టారెంట్ ల‌లో ల‌భించే విధంగా ఉండే వెజ్ ద‌మ్ బిర్యానీ త‌యార‌వుతుంది. దీనిని రైతా, మిర్చి కా సాల‌న్ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అంద‌రూ కూడా ఈ విధంగా చేసిన వెజ్ ద‌మ్ బిర్యానీని ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts