politics

మోడీ ప్రసంగాలు రాసేది ఎవరు.. దానికయ్యే ఖర్చు ఎంతంటే..?

భారత ప్రధాని నరేంద్ర మోడీ అంటే ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఎంతో క్రేజ్ వుంది.. ఆయన సంక్షేమ పథకాలు ఇతర కార్యక్రమాల కంటే ఆయన ప్రసంగాలకు జనాలలో ఎక్కువగా ప్రాధాన్యత ఉంది. ఆయన ప్రసంగం వింటే ప్రతిపక్షాలు కూడా ఆశ్చర్య పోతూ ఉంటాయి. మోడీ ఎప్పుడు ఏదో ఒక చోట ప్రసంగిస్తూనే ఉంటారు.. మరి ఆయన ప్రసంగాలు ఎవరు రాస్తారు.?అనే విషయాన్ని తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది.. అది ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఒక జాతీయ మీడియా సంస్థ సమాచార హక్కు (RTI) దరఖాస్తును పీఎం కార్యాలయంలో దాఖలు చేసింది.. దేని గురించి అంటే.. ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాలను ఎవరు సిద్ధం చేస్తారు అనే వివరాలతోపాటు గా ఎంతమంది చేస్తారు? దానికి చెల్లించే ఖర్చు ఎంత?అనే విషయంపై ఆరా తీసింది. కానీ దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఎటువంటి సమాచారం రాలేదు.. ఎందుకంటే ప్రధానమంత్రి ప్రసంగాలను ఎక్కువగా తానే రాసుకుంటారు అని చెప్పేసింది.. సమయ సందర్భాన్ని బట్టి ప్రధానికి వివిధ వ్యక్తులు,అధికారులు, పలు శాఖలు మొదలైన వారు ప్రసంగానికి సంబంధించిన సమాచారాన్ని ఇస్తే అది పరిశీలించి తానే స్వయంగా రాసుకుంటారు అని పేర్కొంది.

do you know who writes modi speeches

జవహర్లాల్ నెహ్రూ నుంచి నరేంద్ర మోడీ వరకు ఇదే విధంగా కొనసాగుతోంది.. ఇక ప్రసంగాలు నైపుణ్యం విషయానికి వస్తే మాజీ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ,ఇందిరా గాంధీ,అటల్ బిహారీ వాజ్ పెయి లాగా నరేంద్ర మోడీ కూడా అలాగే ఉంటారని తెలుస్తోంది. జవహార్ లాల్ నెహ్రూ తన సొంత ప్రసంగాలు రాసుకోవడానికి సమయం కేటాయించేవారని, ఇతరులపై ఆధారపడటం చాలా తక్కువ అని చాలామంది తెలిసినవారు అంటుంటారు.. మోడీ మాత్రం దానికి ఎంత సమయం కేటాయిస్తారు అనే విషయాన్ని వారు వెల్లడించలేదు.

Admin

Recent Posts