Hotel Style Veg Dum Biryani : మనకు రెస్టారెంట్ లలో లభించే ఆహార పదార్థాల్లో వెజ్ దమ్ బిర్యానీ కూడా ఒకటి. కూరగాయలతో చేసే ఈ దమ్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. ఈ బిర్యానీ నాన్ వెజ్ బిర్యానీలకు ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది. అదే రుచితో, అదే కమ్మదనంతో అలాగే పొడి పొడిగా ఉండేలా ఈ వెజ్ ధమ్ బిర్యానీని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. రెస్టారెంట్ స్టైల్ వెజ్ దమ్ బిర్యానీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వెజ్ ధమ్ బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 టేబుల్ స్పూన్స్, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, బ్రౌన్ ఆనియన్స్ – ముప్పావు కప్పు, పనీర్ ముక్కలు – 100 గ్రా., బిర్యానీ ఆకులు – 2, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 4, యాలకులు – 2, అనాస పువ్వు – 1, జాపత్రి – 1, జీలకర్ర – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ -ఒక టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 5, క్యారెట్ ముక్కలు – పావు కప్పు, ఫ్రోజెన్ బఠాణీ – పావు కప్పు, తరిగిన బీన్స్ – పావు కప్పు, తరిగిన బంగాళాదుంప – 1, పెరుగు – ఒక కప్పు, ఉప్పు – తగినంత, కారం – ఒక టేబుల్ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ధనియాల పొడి -ఒక టేబుల్ స్పూన్, బిర్యానీ మసాలా – రెండు టీ స్పూన్స్, తరిగిన కొత్తిమీర -గుప్పెడు, తరిగిన పుదీనా – 2 టేబుల్ స్పూన్స్, నిమ్మరసం – అర చెక్క.

అన్నం తయారీకి కావల్సిన పదార్థాలు..
అర గంట పాటు నానబెట్టిన బాస్మతీ బియ్యం – అరకిలో, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, మరాఠీ మొగ్గలు – 2, లవంగాలు – 4, యాలకులు – 3, అనాస పువ్వు – 1, సాజీరా – అర టీ స్పూన్, జాపత్రి – కొద్దిగా, ఉప్పు – తగినంత, నూనె – 2 టీ స్పూన్స్, తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన పుదీనా – కొద్దిగా.
వెజ్ దమ్ బిర్యానీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పెరుగును తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, బిర్యానీ మసాలా వేసి కలిపి పక్కకు ఉంచాలి. తరువాత అడుగు మందంగా ఉండే గిన్నెలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత పనీర్ ముక్కలు వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తరువాత అల్లం పేస్ట్, పచ్చిమిర్చివేసి కలపాలి. ఇవి వేగిన తరువాత కూరగాయ ముక్కలు వేసి కలపాలి. తరువాత వీటిపై మూత పెట్టి 3 నిమిషాల పాటు వేయించాలి.
తరువాత ముందుగా కలిపిన పెరుగు, ముప్పావు కప్పు బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసి కలపాలి. తరువాత పావు కప్పు నీళ్లు పోసి మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఇందులో నిమ్మరసం వేసి కలపాలి. తరువాత వేయించిన పనీర్ ముక్కలు వేసి కలిపి పక్కకు ఉంచాలి. తరువాత మరో గిన్నెలో నీళ్లు, ఉప్పుతో పాటు అన్నం తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి నీటిని మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత నానబెట్టుకున్న బియ్యం వేసి 70 నుండి 80 శాతం వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిని వడకట్టి పక్కకు ఉంచాలి. ఇప్పుడు ఇలా ఉడికించిన బియ్యాన్ని ముందుగా తయారు చేసుకున్న కూరగాయల మిశ్రమంపై లేయర్స్ లాగా వేసుకోవాలి. ముందుగా ఉడికించిన బియ్యాన్ని లేయర్ లాగా వేసిన తరువాత దీనిపై బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర చల్లుకోవాలి.
తరువాత అన్నాన్ని మరో లేయర్ లాగా వేసుకోవాలి. మరలా దీనిపై బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర చల్లుకోవాలి. చివరగా మిగిలిన అన్నాన్ని వేసుకుని బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర చల్లుకోవాలి. తరువాత దీనిపై కుంకుమ పువ్వు నీటిని వేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఆవిరి బయటకు పోకుండా సిలవర్ పాయిల్ తో లేదా గోధుమపిండితో సల్ చేసుకుని మూత పెట్టాలి. తరువాత స్టవ్ మీద పెన్నాన్ని ఉంచాలి. ఈ పెనంపై బిర్యానీ గిన్నెను ఉంచి 5 నిమిషాల పాటు పెద్ద మంటపై 15 నిమిషాల పాటు చిన్న మంటపై దమ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ బిర్యానీ గిన్నెను పక్కకు ఉంచి అర గంట పాటు అలాగే ఉంచాలి. తరువాత మూత తీసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెజ్ దమ్ బిర్యానీ తయారవుతుంది. రైతా, మిర్చి కా సాలన్ వంటి వాటితో తింటే ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా వెజ్ దమ్ బిర్యానీని తయారు చేసుకుని తినవచ్చు.