మహాలక్ష్మి దేవి అనుగ్రహం కోసం అనేక రకాలుగా పూజలు చేస్తారు. లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటే ఆ ఇంట సిరుల పంటే. తినడానికి, డబ్బుకు లోటు ఉండదు అంటారు. అందుకే ఆ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి నానా తిప్పలు పడతారు. ముఖ్యంగా శుక్రవారం అంటే అమ్మావారికి ప్రీతికరమని ఆ రోజు మహిళలందరూ తమ శక్తి కొలదీ పూజలు చేస్తూంటారు. అయితే లక్ష్మీ దేవికి అలంకారం అంటే చాలా ఇష్టం. కాబట్టి ఇంట్లో ఉండే మహిళలు కూడా చక్కగా ఉంటే ఆవిడకు నచ్చుతుందట. అయితే తంత్ర శాస్త్రంలో, సంపదను సంపాదించడానికి కొన్ని రకాల సాధారణమైన పద్ధలు ఉన్నాయని చెప్పబడ్డాయి. వాటిని క్రమం తప్పకుండా అనుసరిస్తే కనుక.. వారి ఇంట సంపదకు అస్సలు లోటు ఉండదని ఆ శాస్త్రంలో వివరించారు. మరి అవేంటో తెలుసుకుందాం.
శుక్రవారం రోజను ఓ కొత్త పసుపు వస్త్రం తీసుకుని చిన్న కొబ్బరికాయను కట్టి వంట గది తూర్పు మూలలో వేలాడేలా ఉంచండి. ఇలా చేయడం ద్వారా ఆ ఇంట్లో డబ్బుకు, తిండికి లోటు ఉండదు. ఇంట్లో సంపద పెరగాలంటే ప్రతి శుక్రవారం నెయ్యి దీపం వెలిగించండి. లక్ష్మీ దేవికి రెండు ముఖాల నెయ్యి దీపం వెలిగించి పూజించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. లక్ష్మీ దేవికి తామర పువ్వులన్నా ఇష్టమే. కనుక శుక్రవారం రోజు లక్ష్మీ దేవిని తామర పువ్వులతో పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
అమ్మవారికి సువాసనతో కూడినవి అంటే చాలా ఇష్టం. మల్లె పూల నుంచి కూడా మంచి సువాసన వెదజల్లుతుంది. కాబట్టి ప్రతి శుక్రవారం మల్లెపూలతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. లక్ష్మీ దేవి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ప్రతి శుక్ర వారం ఆవుకు గడ్డి, బెల్లాన్ని ఆహారంగా ఇవ్వాలి. ఇలా చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రమం తొందరగా కలుగుతుంది.