మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయడం, సరైన సమయానికి పోషకాలతో కూడిన ఆహారం తినడం ఎంత ముఖ్యమో రోజుకి తగినన్ని నీళ్లను తాగడం కూడా అంతే అవసరం. నీళ్లను తాగడం వల్ల శరీర జీవక్రియలు సక్రమంగా నిర్వహించబడతాయి. తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. ఆ ఆహారంలో ఉండే పోషకాలను సరిగ్గా శోషించుకుంటుంది. నీళ్లను తాగితే చర్మం హైడ్రేటెడ్గా ఉంటుంది. మృదువుగా మారుతుంది. పొడిదనం తగ్గుతుంది. ఇలా నీళ్లను సరైన మోతాదులో తాగితే అనేక లాభాలను పొందవచ్చు. అయితే ఏ వయస్సులో ఉన్నవారు ఎన్ని నీళ్లను తాగాలో సైంటిస్టులు చెబుతున్నారు. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
16-60 వయస్సు గల స్త్రీలు 4-5 లీటర్ల నీటిని రోజూ తాగడం మంచిది. 60 సంవత్సరాలు పైబడిన వారు 3-4 లీటర్ల నీరు తాగడం మంచిది. పురుషులు, ఎండలో పని చేసే వారు 5 లీటర్ల వరకు తాగాలి. 70 సంవత్సరాలు పైబడిన వారు 3 లీటర్ల నీటిని తాగాలి. 11 నుండి 16 సంవత్సరాల వయస్సు వారు 3 లీటర్ల నీటిని తాగాలి.
10 సంవత్సరాల వయసు, అంతకంటే తక్కువ వయస్సు వారు 2 లీటర్ల వరకు నీటిని తాగాలి. అప్పుడే పుట్టిన పిల్లలకు నీటిని తాగించరాదు. 3 నెలల వయస్సు తర్వాత నీటిని తాగించాలి. ఇక నీళ్లను ఎల్లప్పుడూ కాచి వడబోసిన తరువాత మాత్రమే తాగాలి. వాటర్ ఫిల్టర్ ఉంటే ఫిల్టర్ చేయబడిన నీళ్లను తాగాలి. నీళ్లను స్టోర్ చేసే కుండలు, బాటిల్స్ను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే బ్యాక్టీరియా పెరిగి వ్యాధులకు కారణం అవుతాయి.