ఆధ్యాత్మికం

ఈ చిన్న మంత్రం ..ప్రమాదాల నుంచి రక్షణ ఇస్తుంది!

ఓం త్రయంబకం యజామహే, సుగంధిం పుష్టి వర్ధనం, ఉర్వారుక మివ బంధనాత్, మృత్యోర్ ముక్షీయ మామృతాత్.. మనిషికి ఆయురారోగ్యాన్ని, సౌభాగ్యాన్ని దీర్ఘాయువును, ప్రశాంతతను, సంతోషాన్ని ఇచ్చేదే మహా మృత్యుంజయమంత్రం. శైవులు దీనిని రుద్రాభిషేకంలో, వైష్ణవులు పాంచరాత్రం దీక్షలో హోమ భస్మధారణ మంత్రంగా చెప్పుకుంటారు.

ఈ మంత్రం పరమ పవిత్రమైనది, అత్యంత ప్రాచుర్యమైనది. క్షీర సాగర మథనంలో వచ్చిన విషాన్ని పరమేశ్వరుడు దిగమింగి మృత్యుంజయుడు అయ్యాడు. అందుకే ఈ మంత్రం జపించిన వారంతా ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు పొందుతారని భక్తుల విశ్వాసం. మహా మృత్యుంజయ మంత్రాన్ని సంజీవని మంత్రం అని, మార్కండేయ మంత్రం అని కూడా అంటారు. అనుకోని ఆపదలు చుట్టుముట్టినప్పుడు, బతుకుపై విరక్తి కలిగిప్పుడు..కాసేపు ఈ మంత్రాన్ని పఠిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని పండితులు చెబుతారు.

read this mantra to save yourself from accidents

సకల రోగాల నుంచి ఉపశమనం కల్పించి, అపమృత్యు భయాన్ని తొలగించి, ప్రమాదాల నుంచి రక్షించే శక్తి ఈ మంత్రానికి ఉంటుందంటారు. అందరికి శక్తి నిచ్చే ముక్కంటి, సుగంధ భరితుడు అయిన శివుడిని నేను పూజిస్తున్నాను. దోస పండును తొడిమ నుంచి వేరు చేసినట్టు మృత్యు బందనం నుంచి నన్ను విడిపించి అమరత్వాన్ని ప్రసాదించగాక.. అని అర్థం.

ఈ మంత్రాన్ని నిత్యం 3 సార్లు, 9 సార్లు కుదిరితే 108 సార్లు పారాయణం చేస్తారు. ఈ మంత్రాన్ని భక్తిపూర్వకంగా జపిస్తే దైవ ప్రకంపనలు మొదలై, చుట్టూ ఆవరించి ఉన్న దుష్ట శక్తులు మాయమవుతాయి. ఎందుకంటే ఈ మంత్రాన్ని పఠించిన వారి చట్టూ ఓ శక్తివంతమైన వలయం ఏర్పడుతుందని చెబుతారు. అందుకే ప్రమాదాల బారినుంచి , దురదృష్టం నుంచి బయటపడేందుకు మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తారు. ప్రాతః కాలంలో అయినా సంధ్యా సమయంలో అయినా ఎప్పుడైనా మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠించవచ్చు.

Admin

Recent Posts