ఎన్నో సంప్రదాయాలు, ఆచారాలకు మన దేశంలో కొదవే లేదు..చాలా ఆచారాలను,సంప్రదాయాలను మూఢనమ్మకాలని కొట్టిపారేసినప్పటికి కొన్ని మాత్రం సంప్రదాయం,సైన్స్ కి పోలిక కలిగి ఉంటాయి..పోలికే కాదు చాలా సాంప్రదాయాలు ,ఆచారాలు మనకు ఏదో విధంగా హెల్ప్ చేస్తూనే ఉంటాయి… ఏ పండుగ చేసినా, ఏ కార్యం చేసినా.. ఏదో ఒక ఆచారం ఉంటూనే ఉంటుంది..వాటిల్లో ముగ్గు వేయడం,గొబ్బెమ్మ పెట్టడం..మామిడి తోరణాలు కట్టడం ప్రతి దాని వెనుక ఏదో ఒక ఉపయోగం ఉంటుంది..అవేంటో చూడండి..
మగవారికి మాలతో జపం చేసే సమయం ఉంటుంది, కానీ ఆడవారికి ఆ సమయం ఉండదు కనుక, జ్ఞాన ముద్ర వల్ల కలిగే ఫలితం, చూపుడు వేలు, బ్రొటన వేలు వాడి ముగ్గువేయటం వలన ఆడవారికి కలుతుంది.ముగ్గు వేయడానికి ఎక్కువగా రాతిసున్నము, గుల్లసున్నము, బియ్యం పిండి లేదా రెండూ కలిపి వాడతారు. సున్నము తో ముగ్గు వేస్తే ఆ వాసనకు తేళ్ళూ, జెర్లు, పాములు వంటి విష కీటకాలు ఇంటిలోకి రావు. బియ్యం పిండితో వేస్తే…ఆ పిండి తినటానికి చీమలు చేరతాయి, అవి ఈ విషకీటకాలను చంపుతాయి, ఫలితం ఒకటే.అంతేకాదు ముగ్గును బట్టి ఆ ఇంటామె మనస్తత్వం చెప్పేస్తారు . ఓ రోజు వేయకపోతే… ఆ సదరు మహీళ ఆరోగ్యం బాలేదని లేదా ఆమె మనసు బాలేదని/ ఏదో గొడవ జరిగిందని/ పని ఎక్కువగా ఉందని ఇరుగు పొరుగువారు తెలుసుకుని సహాయపడేవారు.
ఇంకా అనుభవం ఉన్న పెద్దలు (మహిళలు), ఓ మహిళ వేసిన ముగ్గు చూసి ఆమె స్వభావం, మానసిక స్ధితి తెలుపగలిగేవారు.ముగ్గు వేయటం వలన మానసిక వత్తిడితో బాధపడుతున్న మహిళలకు మానసిక సాంత్వన లభిస్తుంది.వారి మానసిక స్థితి ఆ ముగ్గులో ప్రతిఫలిస్తుంది. పండగలప్పుడు ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు. గొబ్బెమ్మలు పేడతో చేస్తారు..ఆడవారి చేతులు ఎక్కువ తడుస్తూ ఉండి చేతులు పగుల్లు ఉంటాయి,గోళ్లల్లో పాచి పేరుకుని ఉంటుంది.. గనుక, చేతులతో పేడను ముట్టుకుని గొబ్బెమ్మలు తయారు చేసి పెట్టిన వారికి చేతులకు ఉన్న చర్మ వ్యాధులు తగ్గుతాయి. ఈ గొబ్బెమ్మలు ముగ్గుల మధ్య దారిలో పెడతారు, అవి తొక్కిన వారి పాదాలకు ఉన్న వ్యాధులు, పగుళ్ళకు ఇవి నివారణకారిగా పనిచేస్తాయి.
మెదటి నుండీ మనల్ని పాలించే రాజును దైవంగా పూజించే ఆచారంఉంది, అలా రాజ్యాలని పాలించిన, సుపరిపాలన అందించిన కొంత మందిని మనం దేవుళ్ళుగా పూజించుకుంటున్నాము.ఛత్రపతి శివాజీని దేవుడికంటే ఎక్కువగా కొలుస్తారు ప్రజలు..అంతే కాదు సమాజానికి, దేశానికి మంచి పనులు చేసిన వారిని పూజించే సాంప్రదాయం మనకు ఉంది.చెడు చేసినవారిని దూషిస్తారు కూడా రాముడు,రావణాసురుడు ఉదాహరణ.భారత దేశంలో ఇష్టదైవ ఆరాధన అని ఓ పద్ధతి ఉంది, దీనిలో భాగంగా ఎవరికి నచ్చిన దేవుళ్ళను వారు సృష్టించుకోవచ్చు. ఆరాధించవచ్చు. ప్రతీ గ్రామానికి ఓ గ్రామ దేవత ఉంటుంది, ప్రతీ ఏడు ఆమెకు తిరుణాళ్ళు చేస్తారు, ఇది గ్రామప్రజలు కలవటానికి దోహద పడుతుంది.అలా కలవడం గ్రామ ప్రజల మధ్య ఐక్యతను తెలుపుతుంది..అలా కలిసినప్పుడు కష్టసుఖాలు చెప్పుకోవడమే కాదు,బాదలు పంచుకోవడానికి ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి తోడ్పడుతుంది.