ఆధ్యాత్మికం

ఈ ఆలయంలో అంత‌కంత‌కు పెరిగిపోతున్న నంది విగ్ర‌హం ఉంది.. దీని ర‌హ‌స్యాన్ని ఎవ‌రూ క‌నిపెట్ట‌లేక‌పోయారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పటి రోజుల లో రాజులు మహా తెలివి పరులు&period; ఎవరికీ అంతు చిక్కని విధంగా అద్భుతాలతో దేవాలయాలను నిర్మించారు&period; అవి ఇప్పుడు మంచి ఆదరణను పొందుతున్నాయి&period; అలాంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఆంధ్రప్రదేశ్ లో లెక్క లేనన్ని ఉన్నాయి&period; అందులో ఒకటి యాగంటి&period; అంతుచిక్కని అద్భుతాలు దాగివున్నాయి&period; ఈ దివ్యక్షేత్రంలో కొలువై ఉన్న నందీశ్వరుని విగ్రహం వెనుక పెద్ద రహస్యమే దాగివుంది&period;&period; ఇప్పటికీ ఎవ్వరూ ఆ విషయం పై ఒక క్లారిటీ ఇవ్వలేదు&period;&period;ఆ గుడి విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;&period; యాగంటిలో ప్రధాన దేవాలయంలో ఉమామహేశ్వర లింగం కొలువై ఉంటుంది&period; శివపార్వతులు ఇద్దరూ ఒకే లింగంలో దర్శనమివ్వడం ఇక్కడ విశేషం&period; వాస్తవానికి ఇక్కడ పరమశివుని ఆలయం నిర్మించటానికి ఒక చరిత్ర ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా సంవత్సరాల క్రితం ఒక రాజు ఈ ప్రదేశంలో వెంకటేశ్వర స్వామి గుడి కట్టాలని సంకల్పించారు&period; అదే సమయంలో రాజుకి శివుడు కలలో ప్రత్యక్షమై తనకు ఇక్కడే గుడి కట్టాలని అదేశించాడని&comma; ఆ క్రమంలోనే శివుడు&comma;పార్వతి ఒకే లింగంలో దర్శనమిచ్చేలా ఈ క్షేత్రాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది&period;&period;అగస్త్య మహాముని చేసిన యాగం వలెనే ఈ క్షేత్రానికి యాగంటి అని పేరు వచ్చిందని చెప్తారు&period; శైవ క్షేత్రమే అయినా ఈ ఆలయం వైష్ణవాలయాన్ని పోలి ఉంటుంది&period;&period; ఈ పుణ్య క్షేత్రం లో ప్రముఖంగా చెప్పబడే యాగంటి బసవన్న స్వయంభువుగా వెలిశాడని చరిత్రచెబుతుంది&period; మొదట్లో చిన్నగా ఉన్న ఈ నంది విగ్రహం రానురాను పెరుగుతూవచ్చి ఆలయ ప్రాంగణాన్ని ఆక్రమించుకుంది&period; ఈ విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-83075 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;yaganti-nandi&period;jpg" alt&equals;"yaganti temple facts and specialties " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ బసవన్న విగ్రహం ఇరవై సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతుందని ఏకంగా పురావస్తు శాఖ నిర్ధారించింది&period; దీనికి సంబంధించిన వివరాలను సైతం ఆలయంలో ఏర్పాటు చేశారు&period; అంతకంతకు పెరిగిపోతుండటం అటు భక్తులను ఆశ్ఛర్యానికి గురిచేస్తుంది&period;&period;బ్రహ్మం గారు చెప్పినట్లు అక్కడి బసవయ్య లేచి రంకెలు వేస్తే ప్రపంచం అంతరించి పోతుంది&period; కర్నూలు జిల్లాలో బ్రహ్మం గారు నివసించిన బనగానపల్లి గ్రామానికి సమీపంలోనే ఈ యాగంటి క్షేత్రం ఉండటం విశేషం&period; ఇకపొతే ఇక్కడ మరో విశేషమేటంటే ఈ క్షేత్రంలో ఒక్క కాకి కూడా కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది&period; కాకులు కనిపించకపోవడం వెనుక ఒక పురాణ గాధ ఉంది&period; అగస్త్య మహా ముని యాగం చేసేటప్పుడు రాక్షసులు కాకి రూపంలో వచ్చి మాంసం ముక్కలను యాగ గుండంలో వేసి ఆటంకం కలిగించారట&period; దీంతో కోపంతో ఆ మహాముని ఈ క్షేత్రంలో కాకులు తిరగకూడదని శాపం ఇచ్చాడని చెబుతారు&period; అప్పటినుంచి ఈ ఆలయ పరిసరాల్లో కాకులు తిరగవు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుష్కరిణిలో స్నానమాచరిస్తే పుణ్యప్రదం&period;&period;ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో ప్రవహించి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో చేరుతుంది&period;&period;నంది ముఖం నుంచి ఎప్పుడూ నీళ్ళు ప్రవహిస్తాయి&period;ఇందులో స్నానమాచరిస్తే సర్వ రోగాలు నయమౌతాయని భక్తుల నమ్మకం&period; మహాశివరాత్రి పర్వదినం రోజున భక్తులు పెద్ద సంఖ్యలో యాంగటిని సందర్శిస్తారు&period;నంద్యాల నుంచి 48 కిలోమీటర్ల దూరంలో గల బనగానపల్లె పట్టణానికి చేరాల్సి ఉంటుంది&period; అక్కడి నుంచి మరో 11 కిమీ ప్రయాణిస్తే యాగంటికి చేరుకోవచ్చు&period; రోడ్డు సదుపాయం మెరుగ్గా ఉండడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విశేషంగా తరలివస్తారు…<&sol;p>&NewLine;

Admin

Recent Posts