తెలుగు ఇండస్ట్రీలో సినిమా హిట్ అయి అందులో హీరో కానీ ఇతర నటుల క్యారెక్టర్ కానీ చాలా హిట్ అయితే వారికి నంది అవార్డులు ప్రధానం చేస్తారు. 1977 నుండి బెస్ట్ హీరో కేటగిరీలో అందించడం ప్రారంభించారు. ఇందులో విన్ అయిన వారికి ఒక వెండి నంది, గోల్డ్ మెడల్, కొంత అమౌంట్, ఒక సర్టిఫికెట్ ను అందిస్తారు. మరి మన తెలుగు హీరోస్ ఎవరు ఎన్ని సార్లు నంది అవార్డులు గెలుచుకున్నారో చూద్దామా.. కమెడియన్ హీరో రాజేంద్రప్రసాద్ రెండు సినిమాలకు నంది అవార్డులను అందుకున్నారు. ఎర్రమందారంకు మొదటి సారి నంది అవార్డు వచ్చింది. తర్వాత ఆ నలుగురు సినిమాకు నంది అవార్డు అందుకున్నారు.
దాసరి ఒకవైపు డైరెక్టర్ మరోవైపు నటుడిగా ఇంకోవైపు రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా వ్యవహరించే వారు.1991 రిలీజ్ అయిన మామగారు సినిమాకు, అలాగే మేస్త్రి సినిమాకు గాను రెండు నంది అవార్డులు వచ్చాయి. కృష్ణంరాజు సినిమాలోని అమరదీపం మూవీకి కృష్ణంరాజు బెస్ట్ యాక్టర్ గా మొదటి నంది అవార్డు అందుకున్నారు. తర్వాత బొబ్బిలి బ్రహ్మన్న మూవీకి రెండవ సారి నంది అవార్డును అందుకున్నారు.
జగపతిబాబు 1996లో వచ్చిన మావి చిగురు సినిమా కు మొదటి నంది అవార్డు అందుకున్నారు. దీని తర్వాత మనోహరం సినిమాకు రెండో నంది అవార్డు అందుకున్నారు.
దేశవ్యాప్తంగా విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న కమలహాసన్ మూడు సార్లు నంది అవార్డును అందుకున్నారు. సాగర సంగమం సినిమాతో మొదటి నంది అవార్డు, స్వాతిముత్యం మూవీతో రెండవ నంది అవార్డ్, ఇంద్రుడు చంద్రుడు మూవీతో మూడవ నంది అవార్డు ఈ విధంగా తెలుగు మూవీస్ లో నంది అవార్డును అందుకున్నారు. ఇక వీరే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు నంది అవార్డు అందుకున్న వారు ఉన్నారు.