వినోదం

భర్త చనిపోయినా మరో వివాహం చేసుకోకుండా సింగల్ లానే మిగిలిపోయిన సినీ తారలు వీరే..

ఈ లోకంలో పుట్టిన జీవులు గిట్టక తప్పదు. కాకపోతే మన ముందు ఎవరూ లేదా మనం ఎవరికీ ముందు అనేది మాత్రం తెలియదు. ఇక మనిషి జీవితంలో అన్ని బంధాలలోకి పెళ్లి బంధం చాలా పవిత్రమైనదిగా హిందూ సంప్రదాయంలో భావిస్తూ ఉంటారు. విభిన్న ఆలోచనలు, మనస్త‌త్వాలు కలిగిన ఇద్దరు వ్యక్తులను పెళ్లి బంధం ఏకం చేస్తుంది. అయితే ఎంతోమంది భర్త మరణించినప్పటికీ వివాహం చేసుకోకుండా అతడి జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్నవారు ఉంటారు. ఇక సినీ పరిశ్రమ విషయానికి వస్తే ఇక్కడ ఒకరిని పెళ్లి చేసుకున్నాక వారు నచ్చకపోతే విడిపోయి మరొకరిని పెళ్లి చేసుకోవడం సర్వసాధారణం అన్నట్టు చూస్తారు. ఇలా ఒకరు నచ్చకపోతే మరొకరిని వివాహం చేసుకున్న వాళ్లు చాలామందే ఉన్నారు. కానీ కొంతమంది సినీ తారలు భర్త మరణించినప్పటికీ అతని జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్న సినీ తారలు కూడా ఉన్నారు. వారు ఎవరెవరో ఇప్పుడు తెలుసుకుందాం..

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో పాత్రలలో నటించి మెప్పించిన సురేఖ వాణి సురేష్ తేజ ని ప్రేమించి వివాహం చేసుకుంది. వీరికి ఒక కూతురు కూడా ఉంది. 2019 మే 6 తేదీన సురేఖ వాణి భర్త సురేష్ అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు. ఇక సురేఖ వాణి మరో పెళ్లి చేసుకోకుండా భర్త జ్ఞాపకాలతో కూతురిని చూసుకుంటూ జీవిస్తుంది. సీనియర్ నటి రోహిణి పరిచయం అక్కర్లేని పేరు. రఘువరన్ తో విడాకులు తీసుకున్న తరువాత రోహిణి మరో పెళ్లి చేసుకోలేదు. అయితే తాము మళ్ళీ కలుస్తామని ఆశించినప్పటికీ రఘువరన్ చనిపోవడంతో ఆ తర్వాత రోహిణి మరో పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. 2009లో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త విద్యాసాగర్ ని వివాహం చేసుకుంది మీనా. మీనా భర్త విద్యాసాగర్ మరణించారు. ఆ తరువాత తన కూతురిని చూసుకుంటూ గడుపుతుంది.

these actress remained single even if their husband died

హీరో శ్రీహరిని ప్రేమించి వివాహం చేసుకుంది డిస్కో శాంతి. కానీ ఆయన హఠాత్తుగా 2013 అక్టోబర్ లో మరణించడంతో అప్పటినుండి డిస్కో శాంతి శ్రీహరి జ్ఞాపకాలతో గడుపుతుంది. సినిమాలు, సీరియల్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్న రాగిణికి 12 ఏళ్లకే వివాహం జరిగింది. అయితే వివాహం జరిగిన కొద్ది కాలంలోనే రాగిణి భర్త చనిపోయారు. ఇక రాగిణి అప్పటినుండి వివాహం చేసుకోకుండా ఉన్నారు.

Admin

Recent Posts