Matar Paneer : రెస్టారెంట్ల‌లో ల‌భించే మ‌ట‌ర్ ప‌నీర్‌ను ఇంట్లోనే ఇలా ఈజీగా చేయండి.. నోరూరిపోతుంది..!

Matar Paneer : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో, పంజాబీ ధాబాలల్లో ల‌భించే ప‌నీర్ వెరైటీల‌ల్లో మ‌ట‌ర్ ప‌నీర్ మ‌సాలా కూడా ఒక‌టి. బ‌ఠాణీ, పనీర్ క‌లిపి చేసే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ క‌ర్రీని రుచి చూసే ఉంటారు. అచ్చం రెస్టారెంట్ ల‌లో లభించే ఈ మ‌ట‌ర్ ప‌నీర్ మ‌సాలాను అదే రుచితో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీకెండ్స్ లో, స్పెష‌ల్ డేస్ లో ఇలా మ‌ట‌ర్ ప‌నీర్ మ‌సాలాను ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. రెస్టారెంట్ స్టైల్ మ‌ట‌ర్ ప‌నీర్ మ‌సాలాను ఇంట్లోనే ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌ట‌ర్ పనీర్ మ‌సాలా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టేబుల్ స్పూన్, ల‌వంగాలు – 3, దాల్చిన చెక్క – అర ఇంచు ముక్క‌, మిరియాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, న‌ల్ల యాల‌క్కాయ – 1, వెల్లుల్లి రెబ్బ‌లు – 8, అల్లం – ఒక ఇంచు ముక్క‌, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), త‌రిగిన ట‌మాటాలు – 4( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), బ‌ట‌ర్ – 2 టేబుల్ స్పూన్స్, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, ఉడికించిన ప‌చ్చి బ‌ఠాణీ – ఒక క‌ప్పు, ప‌సుపు – అర టీ స్పూన్, కాశ్మీరి చిల్లీ కారం – 2 టీ స్పూన్స్, ధ‌నియాల పొడి – 2 టీ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, నీళ్లు – ఒక క‌ప్పు, ప‌నీర్ – 200 గ్రా., క‌సూరిమెంతి – అర టీ స్పూన్, గ‌రం మ‌సాలా – పావు టీ స్పూన్.

Matar Paneer recipe in telugu make it in restaurant style
Matar Paneer

మ‌ట‌ర్ పనీర్ మ‌సాలా త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ప‌నీర్ ముక్క‌లను వేసి వేయించాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో ల‌వంగాలు, దాల్చిన చెక్క‌, న‌ల్ల యాల‌క్కాయ‌, మిరియాలు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత అల్లం, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు, ఉప్పు వేసి క‌ల‌పాలి. వీటిపై మూత పెట్టి ట‌మాట ముక్క‌ల‌ను మెత్త‌గా ఉడికించుకోవాలి. అవ‌స‌ర‌మైతే కొద్దిగా నీటిని పోసుకుని ముక్క‌ల‌ను మెత్త‌గా ఉడికించాలి. ట‌మాట ముక్క‌లు మెత్త‌గా ఉడికిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి వీటిని చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత ఇందులో ఉండే న‌ల్ల‌యాల‌క్కాయ‌ను తీసి వేసి మిగిలిన ప‌దార్థాల‌న్నింటిని జార్ లో వేసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి.

ఇప్పుడు క‌ళాయిలో బ‌ట‌ర్ వేసి వేడి చేయాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ప‌చ్చి బ‌ఠాణీ వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ప‌సుపు, కారం, ధ‌నియాల పొడి, ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి మ‌రో 5 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత వేయించిన పనీర్, గ‌రం మ‌సాలా, క‌సూరిమెంతి వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి మ‌రో 3 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మ‌ట‌న్ ప‌నీర్ మ‌సాలా త‌యార‌వుతుంది. దీనిని అన్నం, రోటీ, చ‌పాతీ, నాన్, బ‌ట‌ర్ నాన్ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది.

Share
D

Recent Posts