అల్లం.. బెల్లం.. రెండూ ఆరోగ్యకరమైన ప్రయోజనాలనిచ్చే పదార్థాలే. వీటిని మనం తరచూ వంటల్లో ఉపయోగిస్తుంటాం. రెండింటిలోనూ అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకునేందుకు ఇవి రెండూ ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ లాభాలు కలుగుతాయి. అల్లం, బెల్లం మిశ్రమాన్ని రోజూ రెండు పూటలా కొద్ది మోతాదులో తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. రోగ నిరోధక శక్తిని పెంచడంలో అల్లం, బెల్లం మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది. బెల్లంలో జింక్, సెలీనియం తదితర పోషకాలు ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్ వల్ల శరీరానికి కలిగే నష్టాన్ని అడ్డుకుంటాయి. ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తాయి. అల్లంలో యాంటీ ఇన్ఫ్లామేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రాకుండా చూస్తాయి.
2. జీర్ణ సమస్యలతో బాధపడేవారికి అల్లం, బెల్లం మిశ్రమం ఎంతగానో పనిచేస్తుంది. మలబద్దకం తగ్గుతుంది. పేగుల్లో ఆహారం కదలికలు సరిగ్గా ఉంటాయి. రెండింటిలో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని పెంచుతుంది. భోజనం తరువాత అల్లం, బెల్లం మిశ్రమాన్ని తీసుకుంటే ఫలితం ఉంటుంది.
3. అల్లం, బెల్లం మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి, లివర్లోని వ్యర్థాలు బయటకు పోతాయి, శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. శక్తి లభిస్తుంది. హైబీపీ నియంత్రణలోకి వస్తుంది. రుతు సమయంలో స్త్రీలకు నొప్పులు తగ్గుతాయి.
4. అల్లం, బెల్లం మిశ్రమంలో తేనె కలిపి కూడా తీసుకోవచ్చు. దీంతో శారీరక దృఢత్వం లభిస్తుంది. అనారోగ్య సమస్యలు, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.
ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం టెలిగ్రామ్లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365