ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేవరకూ ఒకటే పని మొబైల్ చూడడం.అరచేతిలో మొభైల్ ఉంటే చాలు ప్రపంచమే మన చేతుల్లో ఉన్నట్టుగా ఫీలవుతుంటాం.ఎప్పుడూ ఆ మొబైల్లోనే తలమునకలవుతూ ఎప్పుడు లేస్తామో,ఎప్పుడు తింటామో ,ఎప్పుడు పడుకుంటామో తెలియకుండా గడిపేస్తుంటాం. .కొందరైతే ఇరవైనాలుగ్గంటలూ ఆన్లైన్లోనే ఉంటూ ఏ అర్ద రాత్రో నిద్రపోతారు..పది దాటింతర్వాత మొభైల్ కాని,టివి కాని చూస్తే ఎలాంటి దుష్ఫలితాలున్నాయో తెలుసుకోండి..ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. రాత్రి పది గంటలు దాటిన తర్వాత సోషల్ మీడియాలో గడపటం, టీవీ చూడటం వంటి అలవాట్లున్న వారు తీవ్రమైన ఒత్తిడి, ఆత్మన్యూనత భావం, ఒంటరితనం వంటి మానసిక సమస్యలకు గురికాక తప్పదని ది లాన్సెట్ సైకియాట్రీ జర్నల్లో విడుదలైన ఒక నివేదిక వెల్లడించింది.
అలాంటి వారి రోజూవారి దినచర్యల్లో తీవ్ర మందకొడితనం నెలకొంటుందని తెలిపింది. బై పోలార్ డిసార్డర్ ద్వారా కోపం, బాధ, చిరాకు వంటివి వారిలో తీవ్రమవుతాయని రిపోర్టు పేర్కొంది. తగినంత విశ్రాంతి లేకపోవడంతో వారు నరాల వ్యాధులకు కూడా గురికావొచ్చని నివేదిక హెచ్చరించింది. బాగా పొద్దు పొయాక నిద్ర పోయేవారు ఆనందంగా ఉండలేరని, ఎప్పుడూ ఒంటరి తనంతో బాధ పడుతుంటారని ఈ రిపోర్టు స్పష్టం చేసింది.
దాదాపు 91 వేల మంది మధ్య వయస్కులపై పరిశోధన చేసి ఒక రిపోర్టు తయారు చేసింది. వారందరినీ సోషల్ వేదికలు, టీవీల్లో మునిగిపోయేలా చేసి వారి దినచర్యల్లో వచ్చిన మార్పులను గుర్తించింది. వారిలో 6 శాతం మంది మానసిక ఒత్తిడి,11 శాతం మంది బై పోలార్ డిసార్డర్, 9 శాతం మంది ఆనందంగా లేకపోవడం గుర్తించింది. నిజమే కదా. ఒకట్రెండు రోజులు నిద్ర లేకుండా ఏదన్నా పని చేసినా ప్రయాణించినా అలసటతో ఆ ప్రభావం తర్వాత రోజుపై పడుతుంది .అలాంటిది ఇన్నేసి రోజులు మొబైల్ కి అతుక్కుపోయి నిద్రకు దూరమైతే మన ఆరోగ్య పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి.