ర‌క్తం బాగా త‌క్కువ‌గా ఉందా.. అయితే ఇలా చేయండి.. ర‌క్తం బాగా ప‌డుతుంది..

ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య.. రక్త హీనత. ఒంట్లో సరిగ్గా రక్తం ఉండక ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. రక్తం సరిపోయేంతగా లేకపోవడం వల్ల మనిషి బలం తక్కువవడం.. ఎటువంటి పని చేయలేకపోవడం, ఏ పనీ చేయలేకపోవడం లాంటి సమస్యలు వస్తుంటాయి. అయితే.. చాలామంది రక్తాన్ని పెంచుకోవడం కోసం ఇంగ్లీష్ మందులను వాడుతుంటారు. ట్యాబ్లెట్లు వేసుకొని రక్తాన్ని పెంచుకుంటుంటారు. ముఖ్యంగా మహిళలకు రుతుస్రావం సమయంలో ఎక్కువ రక్తం పోవడం వల్ల.. వాళ్లకు రక్త హీనత సమస్య వస్తుంటుంది. మరికొందరిలో ఇతర సమస్యల వల్ల రక్తం తక్కువగా ఉంటుంది. అయితే.. మన ఇంట్లో వంటింటి చిట్కాలతో ఒంట్లో రక్తాన్ని అమాంతం పెంచుకోవచ్చు. ఒక్క ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు.

నిజానికి.. మన ఒంట్లో హిమోగ్లోబిన్ శాతం ఎంత ఎక్కువ ఉంటే.. మన ఒంట్లో అంత రక్తం ఉన్నట్టు లెక్క. సాధారణంగా పురుషులకైతే.. 13. 5 నుంచి 16. 5 గ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలి. మహిళలకు అయితే.. 12 నుంచి 15 గ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలి. ప్రెగ్నెంట్ మహిళలకు అయితే 10 నుంచి 15 మధ్యలో ఉండాలి. మన ఒంట్లో రక్తం పెరగాలంటే మన ఆహారంలో ఖచ్చితంగా ఐరన్ ఎక్కువగా ఉండాలి. మహిళలకు ప్రతి రోజు 30 గ్రాముల ఐరన్ అవసరం అవుతుంది. పురుషులకు అయితే రోజూ 28 గ్రాముల ఐరన్ అవసరం అవుతుంది. తినే ఆహారంలో ప్రతిరోజూ ఎక్కువ ఐరన్ ఉండేలా చూసుకోవాలి.

take these juices to cure anemia

రక్తం త్వరగా పెరగాలి అంటే.. రోజూ ఉదయం.. క్యారెట్ జ్యూస్ తాగండి. పండ్ల రసాలు కంటే.. క్యారెట్ జ్యూస్ మేలు. షుగర్ లాంటి సమస్యలు లేని వాళ్లు అయితే.. క్యారెట్, బీట్ రూట్ జ్యూస్ తాగొచ్చు. ఉదయం పూట రెండు క్యారెట్లు, బీట్ రూట్, టమాట, కీర దోస‌తో కూడా జ్యూస్ చేసుకొని తాగొచ్చు. ఆ జ్యూస్ లో ఎండు ఖర్జూరం పొడి, తేనె కలుపుకొని తాగితే చాలు. ఇలా.. ప్రతి రోజూ తాగితే.. ఒంట్లో రక్తం అమాంతం పెరుగుతుంది. ఒకవేళ గోధుమ గడ్డి పొడి దొరికినా.. దాన్ని కూడా కలుపుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది. సాయంత్రం పూట ఏదైనా ఒక పండ్ల జ్యూస్ తాగండి. బత్తాయి జ్యూస్ కానీ.. కమలం జ్యూస్ అయినా.. ఏదైనా పండ్ల జ్యూస్ తాగొచ్చు. లేదంటే ఒక గ్లాస్ చెరుకు రసం తాగినా చాలు. పండ్ల జ్యూస్ లో ఇంత తేనె, ఎండు ఖర్జూరం పొడిని వేసుకొని తాగండి. దీంతో ర‌క్తం బాగా త‌యార‌వుతుంది. ర‌క్త‌హీన‌త నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Share
Editor

Recent Posts