కిడ్నీలలో స్టోన్స్‌ను కరిగించే అద్భుతమైన చిట్కాలు..!

నీళ్లను తగినంత మోతాదులో తాగకపోవడం వల్ల, కిడ్నీల్లో వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల, వంశ పారంపర్యంగా, ఆగ్జలేట్స్‌ ఉండే ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల.. కిడ్నీ స్టోన్లు వస్తుంటాయి. ఆరంభంలో నొప్పి కొద్దిగానే ఉంటుంది. ఆ సమయంలో రాళ్లు చిన్నగా ఉంటాయి. కనుక అప్పుడే చిన్న చిట్కాలను పాటిస్తే రాళ్లను కరిగించుకోవచ్చు. లేదంటే రాళ్లు పెద్ద సైజ్‌లోకి మారితే తీవ్రమైన ఇబ్బందులు వస్తాయి. కిడ్నీలకు నష్టం జరుగుతుంది. ఇక కిడ్నీ స్టోన్లను కరిగించేందుకు పాటించాల్సిన చిట్కాలు ఇవే..!

కిడ్నీలలో స్టోన్స్‌ను కరిగించే అద్భుతమైన చిట్కాలు..!

 

 

 

1. ఒక గ్లాస్‌ కొబ్బరినీళ్లలో ఒక నిమ్మకాయను పూర్తిగా రసం పిండి రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగుతుండాలి. దీంతో కిడ్నీ స్టోన్లు కరిగిపోతాయి.

2. పుచ్చకాయ విత్తనాలను సేకరించి ఎండ బెట్టి పొడి చేయాలి. యాలకులను పొడి చేసుకోవాలి. ఈ రెండు పొడులను ఒక టీస్పూన్‌ మోతాదులో తీసుకోవాలి. రాత్రి పూట ఒక గ్లాస్‌ నీటిలో ఈ రెండు పొడులను ఒక టీస్పూన్‌ మోతాదులో తీసుకుని వేసి బాగా కలపాలి. అనంతరం మూత పెట్టి అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం నీటిని వడకట్టి తాగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే మూత్రపిండాల్లో రాళ్లు పడిపోతాయి.

3. రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక కప్పు ముల్లంగి ముక్కలను తినాలి. లేదా ఒక కప్పు ముల్లంగి జ్యూస్‌ తాగవచ్చు. ఇలా చేస్తుంటే కిడ్నీ స్టోన్లు కరిగిపోతాయి.

4. యాపిల్‌ పండు తొక్కలో సిట్రిక్‌ యాసిడ్‌ ఉంటుంది. అందువల్ల కిడ్నీ స్టోన్లను అది కరిగిస్తుంది. యాపిల్‌ పండుకు ఉన్న తొక్కను తీసి విడిగా తింటుండాలి. దీని వల్ల స్టోన్స్‌ పడిపోతాయి.

మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఉన్నవారు రోజూ తగినంత నీటిని తాగాలి. అలాగే పాలకూర, టమాటా వంటి ఆహారాలను వీలైనంత మేర తక్కువగా తీసుకోవాలి. నిమ్మజాతికి చెందిన లేదా విటమిన్‌ సి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. దీంతో కిడ్నీ స్టోన్స్‌ ను తొలగించుకోవచ్చు.

Share
Admin

Recent Posts