Healthy Drink : ప్రస్తుత తరుణంలో చాలా మంది అధిక బరువు సమస్యతో సతమతం అవుతున్నారు. శరీరంలో అధికంగా ఉన్న కొవ్వును కరిగించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. దీంతోపాటు చాలా మందికి పొట్ట దగ్గర కొవ్వు కూడా అధికంగా ఉంటోంది. ఈ క్రమంలోనే అధిక బరువును, పొట్ట దగ్గరి కొవ్వును తగ్గించుకునేందుకు రక రకాల మార్గాలను అనుసరిస్తున్నారు.
అధిక బరువును తగ్గించుకోవాలంటే రోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాల్సి ఉంటుంది. అలాగే సరైన ఆహారం తీసుకోవాలి. డైట్లో మార్పులు చేసుకోవాలి. ఈ క్రమంలోనే రోజూ ఉదయాన్నే పరగడుపునే కింద తెలిపిన విధంగా డ్రింక్ను తయారు చేసుకుని తాగితే దాంతో అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. దీంతో పొట్ట దగ్గరి కొవ్వు కూడా సులభంగా కరిగిపోతుంది. మరి ఆ డ్రింక్ను ఎలా తయారు చేయాలంటే..
ఒక అరటి పండు, ఒక నారింజ పండు, ఒక క్యారెట్.. మూడింటినీ తీసుకుని పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. అనంతరం వాటిని మిక్సీలో వేసి జ్యూస్ తీయాలి. అందులో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి ఉదయాన్నే పరగడుపునే తాగేయాలి.
ఇలా ఈ డ్రింక్ను రోజూ తాగడం వల్ల శరీర మెటబాలిజం మెరుగు పడుతుంది. ఈ మూడింటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు కొవ్వును కరిగించడంలో సహాయ పడతాయి. దీంతో అధిక బరువు తగ్గుతారు. కొవ్వు కూడా కరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. శరీరానికి పోషకాలు, శక్తి లభిస్తాయి. వ్యాధుల నుంచి సురక్షితంగా ఉండవచ్చు.