చిగుళ్ల నుంచి ర‌క్త‌స్రావం అవుతున్న వారు ఈ చిట్కాల‌ను పాటిస్తే స‌మ‌స్య త‌గ్గుతుంది..!!

చిగుళ్ల స‌మ‌స్య‌లు అనేవి స‌హ‌జంగానే చాలా మందికి వ‌స్తుంటాయి. చిగుళ్ల వాపు లేదా ర‌క్త స్రావం అవుతుంటుంది. దీంతో ఏది తినాల‌న్నా, తాగాల‌న్నా ఇబ్బందిగానే ఉంటుంది. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల చిగుళ్ల స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. చిగుళ్ల నుంచి కారే ర‌క్త స్రావం త‌గ్గుతుంది. చిగుళ్ల వాపులు త‌గ్గుతాయి. చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే..

చిగుళ్ల నుంచి ర‌క్త‌స్రావం అవుతున్న వారు ఈ చిట్కాల‌ను పాటిస్తే స‌మ‌స్య త‌గ్గుతుంది..!!చిగుళ్ల నుంచి ర‌క్త‌స్రావం అవుతున్న వారు ఈ చిట్కాల‌ను పాటిస్తే స‌మ‌స్య త‌గ్గుతుంది..!!

1. గ్రీన్ టీని తాగ‌డం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. గ్రీన్ టీ వ‌ల్ల నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది. దంత క్ష‌యం నివారించ‌బ‌డుతుంది. నోట్లో ఉండే బాక్టీరియా న‌శిస్తుంది. చిగుళ్లు ఆరోగ్యంగా మారుతాయి. రోజుకు 2 సార్లు ఒక కప్పు మోతాదులో గ్రీన్ టీని తాగుతుంటే చిగుళ్ల స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

2. ల‌వంగం నూనె మ‌న‌కు మార్కెట్‌లో ల‌భిస్తుంది. దాన్ని చిగుళ్ల స‌మ‌స్య‌ల‌కు ఉప‌యోగించ‌వ‌చ్చు. ఇబ్బందిగా ఉన్న చిగుళ్ల‌పై రోజూ రాత్రి ల‌వంగం నూనెను రాయాలి. దీంతో చిగుళ్ల నుంచి ర‌క్త‌స్రావం త‌గ్గుతుంది. చిగుళ్ల వాపులు పోతాయి. చిగుళ్లు ఆరోగ్యంగా మారుతాయి. ల‌వంగం నూనెలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ, యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు చిగుళ్ల స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి.

3. సోంపు గింజ‌ల‌ను తిన‌డం వ‌ల్ల నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది. నోట్లో ఉండే బాక్టీరియా న‌శిస్తుంది. చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అందువ‌ల్ల రోజుకు 3 సార్లు సోంపు గింజ‌ల‌ను న‌ములుతుంటే చిగుళ్లు ఆరోగ్యంగా మారుతాయి.

4. ఆయిల్ పుల్లింగ్ చేయ‌డం వ‌ల్ల నోరంతా శుభ్రంగా మారుతుంది. నోట్లో ఉండే క్రిములు న‌శిస్తాయి. దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. నోట్లో కొబ్బ‌రినూనె వేసుకుని నోరంతా క‌లియ తిప్పాలి. ఇలా రోజూ 5 నిమిషాలు చేస్తే చాలు. నోరంతా శుభ్ర‌మ‌వుతుంది. దంతాలు, చిగుళ్ల స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

5. తేనెలో యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ ల‌క్ష‌ణాలు ఉంటాయి. అందువ‌ల్ల అవి బాక్టీరియాను చంపేస్తాయి. ర‌క్త‌స్రావాన్ని త‌గ్గిస్తాయి. తేనెను కొద్దిగా తీసుకుని స‌మ‌స్య ఉన్న చిగుళ్ల‌పై రాయాలి. దీంతో ర‌క్త‌స్రావం, వాపులు త‌గ్గుతాయి. చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

6. రోజూ ఉద‌యం, సాయంత్రం ఉప్పు నీళ్ల‌ను నోట్లో పోసుకుని పుక్కిలిస్తుండాలి. దీని వ‌ల్ల కూడా చిగుళ్ల స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

7. కొద్దిగా ప‌సుపును తీసుకుని అందులో కొబ్బ‌రినూనె వేసి క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని చిగుళ్ల‌పై రాయాలి. కొంత సేప‌టి త‌రువాత గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను నోట్లో పోసి పుక్కిలించాలి. దీంతో చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

Admin

Recent Posts