అందంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కేవలం స్త్రీలే కాదు పురుషులు కూడా తమ అందంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. అందులో భాగంగానే ఖరీదైన బ్యూటీ పార్లర్ చికిత్సలను కూడా తీసుకుంటున్నారు. అయితే ఓ సహజసిద్ధమైన చిట్కాను పాటిస్తే దాంతో కేవలం ముఖం మాత్రమే కాదు శరీరం మొత్తం కాంతివంతంగా మారుతుంది. ఇక ఆ చిట్కా ఏమిటి.. ఎలా వాడాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తాజా నిమ్మరసం చర్మం రంగును మెరుగుపరచడానికి బాగా ఉపయోగ పడుతుంది. ఒక టీ స్పూను తాజా నిమ్మరసం, రెండు టీ స్పూన్లు కీరా జ్యూస్, ఆలివ్ ఆయిల్ మూడు టీ స్పూన్లు తీసుకుని మూడింటినీ కలుపు కోవాలి. ముందుగా నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి.
వేళ్ళతో నెమ్మదిగా రబ్ చేయాలి. ఆ తర్వాత సబ్బుతో కడిగేసుకోవాలి. ఈ మిశ్ర మాన్ని ముఖానికే కాకుండా శరీర మంతా కూడా అప్లై చేసుకోవచ్చు. స్నానానికి వెళ్ళే ముందు ఈ చిట్కా పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా ప్రతిరోజూ స్నానానికి ముందు చేయడం వల్ల మీ చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా తయారవుతుంది.