రాజు అనగానే…ఓ పెద్ద సైన్యం..అడుగు తీసి అడుగేయాలంటే బోలెడంత మంది నౌకర్లు. స్నానం చేసేటప్పుడు వీపు రుద్దడానికి ఒకడు… చిటికేస్తే మంచినీళ్లు అందిచడానికి ఇద్దరు..ఇలా రాజభవనమంతా సేవకులతో నిండిపోతుంది. కానీ ఈ రాజు స్టైల్ వేరు…ప్రజల కోసమే నేను అంటూ తన జీవితాన్ని ప్రజలకే అంకిమిచ్చిన అసలు సిసలు రాజు ఈ బికనీర్ మహారాజు గంగా సింగ్…. పేరుకు తగ్గట్టే గంగా జలమంతా పవిత్ర హృదయం కలవాడు. 1888 నుండి 1943 వరకు రాజస్థాన్ లోని బికనర్ ను కేంద్రంగా చేసుకొని పాలించాడు.
అత్యాధునిక సంస్కరణలు తీసుకు రావడంలో ఈ గంగాసింగ్ చాలా ముందుండే వాడు. అంతే కాదు..ఆ కాలంలోనే చదువు విలువ తెసుకొని, అనేక శాస్త్ర విషయాలను నేర్చుకున్నాడు. ఇవన్నీ పక్కకు పెడితే అందరు రాజలు పండుగలు, పబ్బాలు ,వేడుకల పేరుతో ఖజానాను ఖాళీ చేస్తుంటే ఈ రాజు మాత్రం ….వేడుకల సమయంతో ఓ త్రాసు ను తెప్పించిన తాను ఓ వైపు కూర్చొని, మరో వైపు తనకు తూగే బంగారాన్ని తూకం వేసి…తన రాజ్య ప్రజలకు సమానంగా పంచమని చెప్పేవాడు.
కరువు పరిస్థితులు వచ్చినప్పుడు పన్ను రద్దు చేయడం…ఆపదలో ఉన్న ప్రజలను సొంత అన్నలా కాపాడడం ఈ రాజు ప్రత్యేకతలు…ఇతని ధైర్య సహాసాలను చూసి…బ్రిటీష్ వారు తమ మొదటి ప్రపంచ యుద్దంలో ఓ రెజ్మెంట్ కు మనోడినే అధికారిగా చేశారు. ప్రత్యర్థి రాజులను ఎలా ఖంగు తినిపించాడో…అంతకు మించిన వేగంతో దసుకెళ్తూ మొదటి ప్రపంచ యుద్దంలో ఆంగ్లేయులను గెలిపించడంలో ప్రముఖ పాత్రను వహించాడు.ఈ గంగాసింగ్. ఈయన పేరుకు ఆంగ్లేయుల పక్షమే అయినప్పటికీ తన ప్రజలకు మాత్రం ఎలాంటి హాని జరగకుండా చూసుకున్నాడు.